త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఆరేళ్ల బాలికపై మైనర్స్ దారుణం

బాలికను బిల్డింగ్ పైకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మైనర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

J

Crime | Published On Jan 29, 2026, 8.34 pm IST

ఆరేళ్ల బాలికపై మైనర్స్ దారుణం
Advertisement

6 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్స్ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని భజన్‌పురలో చోటు చేసుకుంది. 13 నుంచి 15 ఏళ్ల వయసు లోపు ఉన్న ముగ్గురు మైనర్స్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు మైనర్స్ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నారు. రక్తం అంటిన బట్టలతో బాలిక ఇంటికి రావడంతో గమనించిన బాలిక తల్లి ఏం జరిగిందని ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కి బాలికను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలికను బిల్డింగ్ పైకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మైనర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై జనవరి 18న పోలీసులకు ఫిర్యాదు చేసినా, నిందితులను అరెస్ట్ చేసినా ఆ కేసుపై ఇంకా ఎలాంటి దర్యాప్తు జరగడం లేదని, బాధితురాలికి ఎలాంటి న్యాయం జరగలేదని భజన్‌పుర స్థానికులు గత నాలుగు రోజుల నుంచి రోడ్డుపై నిరసన తెలుపుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement