త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | భార‌త్ సెమీఫైన‌ల్‌కు చేర‌ద‌న్నాడు.. క‌ట్ చేస్తే భారీ ఎత్తున ట్రోల్స్‌..

T20 World Cup 2026 | వెస్టిండీస్‌పై భార‌త్‌ విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్స్‌కు చేరుకున్న తర్వాత పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మ‌హ‌మ్మ‌ద్ అమీర్ సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. భారత్ సెమీస్‌కు చేరదని చెప్పిన‌ అమీర్ ఈ మ్యాచ్‌కు ముందు కూడా తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు.

S

Cricket | Published On Mar 2, 2026, 11.39 am IST

T20 World Cup 2026 | భార‌త్ సెమీఫైన‌ల్‌కు చేర‌ద‌న్నాడు.. క‌ట్ చేస్తే భారీ ఎత్తున ట్రోల్స్‌..
Advertisement

T20 World Cup 2026 | వెస్టిండీస్‌పై భార‌త్‌ విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్స్‌కు చేరుకున్న తర్వాత పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మ‌హ‌మ్మ‌ద్ అమీర్ సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. భారత్ సెమీస్‌కు చేరదని చెప్పిన‌ అమీర్ ఈ మ్యాచ్‌కు ముందు కూడా తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. అయితే ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ పోరులో సంజు శాంస‌న్ అజేయంగా 50 బంతుల్లో 97 పరుగులు చేయ‌డంతో భారత్ 5 వికెట్ల తేడాతో ఘ‌న విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తొలుత‌ వికెట్లు కోల్పోయినా, శాంసన్ ఒంటరిగా పోరాడి జట్టును సెమీస్‌కు చేర్చాడు.

భార‌త్ సెమీస్‌కు చేర‌ద‌ని వ్యాఖ్య‌లు..

జియో న్యూస్‌లో ప్రసారమైన హార్నా మనా హై కార్యక్రమంలో అమీర్ మాట్లాడుతూ పాకిస్థాన్ సెమీస్‌కు చేరినా చేరకపోయినా, భారత్ మాత్రం సెమీస్‌కు రాదు.. అని వ్యాఖ్య‌లు చేశాడు. అలాగే భారత ఫీల్డింగ్ బలహీనంగా ఉందని, బుమ్రా తప్ప మిగతా బౌలర్లు బలహీనంగా ఉన్నారని, భారత్ ఈ టోర్నమెంట్ లో గెలవదని చెప్పాడు. అంతకు ముందు దక్షిణాఫ్రికాపై భారత్ ఓడిపోతుందని కూడా చెప్పిన‌ అమీర్‌ను సహ-ప్యానలిస్టులు సరదాగా జ్యోతిష్కుడిగా పిలిచారు. అయితే వెస్టిండీస్‌పై భారత్ విజయం సాధించడంతో అత‌ని అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి.

శాంస‌న్ అద్భుత ఇన్నింగ్స్‌..

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ పునాది వేసిన ఇన్నింగ్స్ అనంతరం రోవ్మన్ పవెల్ (34 నాటౌట్‌, 19 బంతులు), జేసన్ హోల్డర్ (37 నాటౌట్‌, 22 బంతులు) చివర్లో దూకుడు ప్రదర్శించారు. 65వేల‌కు పైగా ప్రేక్షకుల సమక్షంలో ఒత్తిడిలో ఉన్న సమయంలో శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని అజేయ 97 పరుగులతో భారత్ 19.2 ఓవర్లలో 199/5 స్కోర్ చేసి విజయం సాధించింది. భారత్ మార్చి 5న ముంబై వాంఖెడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ ఆడనుంది. కాగా సోషల్ మీడియాలో అభిమానులు అమీర్ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ట్రోలింగ్ ప్రారంభించారు. మళ్లీ అంచనా తప్పింది అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement