Shane Warne | రాజస్థాన్ రాయల్స్ అమ్మకం.. షేన్ వార్న్ కుటుంబానికి దక్కనున్న రూ.450 కోట్లు..
Shane Warne | ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ బంతితో మాయాజాలం సృష్టించడమే కాకుండా, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే దూరదృష్టి కలిగిన వ్యక్తిగా కూడా నిలిచారు. 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పుడు, తన ఒప్పందంలో చేర్చిన ఒక ప్రత్యేక క్లాజ్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయన కుటుంబానికి భారీ లాభం తీసుకురానుంది.
Shane Warne | ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ బంతితో మాయాజాలం సృష్టించడమే కాకుండా, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే దూరదృష్టి కలిగిన వ్యక్తిగా కూడా నిలిచారు. 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పుడు, తన ఒప్పందంలో చేర్చిన ఒక ప్రత్యేక క్లాజ్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయన కుటుంబానికి భారీ లాభం తీసుకురానుంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టును అమెరికాకు చెందిన కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.15,290 కోట్లు) కొనుగోలు చేయడంతో ఆ క్లాజ్ అమల్లోకి వచ్చింది.
ఆడిన ప్రతి సీజన్కు 0.75 శాతం యాజమాన్య వాటా..
2008 ఐపీఎల్ సీజన్కు ముందు షేన్ వార్న్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆయనకి కెప్టెన్ బాధ్యతలతోపాటు జట్టు క్రికెటింగ్ కార్యకలాపాలపై సంపూర్ణ నియంత్రణ కూడా ఇచ్చారు. ఈ ఒప్పందంలో భాగంగా జట్టుకు ఆయన ఆడిన ప్రతి ఏడాది 0.75 శాతం యాజమాన్య వాటాను ఆయనకి కేటాయించారు. అప్పట్లో ఆయన ది హెరాల్డ్ సన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన ఒప్పందంలో భాగంగా తనను కెప్టెన్గా, కోచ్గా, అలాగే జట్టును నిర్వహించేందుకు కూడా బాధ్యతలు వహించాలని జట్టు యాజమాన్యం కోరిందని, తాను మొత్తం బాధ్యతలు చూసుకునే వ్యక్తినని వార్న్ తెలిపారు.
వార్న్ వాటా విలువ రూ.450 కోట్లు..
వార్న్ రాజస్థాన్ రాయల్స్ తరఫున నాలుగు సీజన్లలో ఆడగా, 2008లో తొలి సీజన్లోనే జట్టుకు టైటిల్ అందించారు. కాగా ఆయన యాజమాన్య వాటా మొత్తం 3 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం జట్టు 1.63 బిలియన్ డాలర్లకు అమ్ముడవడంతో, వార్న్ వాటా విలువ సుమారు రూ.450-460 కోట్లకు చేరింది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత, ఈ వాటాను విక్రయించి నగదు రూపంలో తీసుకునే అర్హత ఆయన కుటుంబానికి ఉంటుంది. అయితే ఈ ఒప్పందానికి బీసీసీఐ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మొదటగా 2008లో ఈ ఫ్రాంచైజీని మనోజ్ బాదలే నేతృత్వంలోని ఎమర్జింగ్ మీడియా కేవలం 67 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే 2022లో షేన్ వార్న్ కన్నుమూశారు. అయినప్పటికీ ఆయన 18 ఏళ్ల కిందట తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు ఆయన కుటుంబానికి భారీ లాభాన్ని తెచ్చిపెట్టింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Hardik Pandya | గర్ల్ఫ్రెండ్తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



