త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్ర‌క్కు.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

Karnataka | క‌ర్ణాట‌క‌లో గురువారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. తీర్థ‌యాత్ర‌కు బ‌య‌ల్దేరిన ఓ మినీ ట్ర‌క్కు.. అదుపుత‌ప్పి ఎదురుగా వ‌స్తున్న లారీని ఢీకొట్టింది.

S

National | Published On Jul 9, 2026, 2.03 pm IST

Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్ర‌క్కు.. ఏడుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Karnataka | త్రినేత్ర‌.న్యూస్ : క‌ర్ణాట‌క‌లో గురువారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. తీర్థ‌యాత్ర‌కు బ‌య‌ల్దేరిన ఓ మినీ ట్ర‌క్కు.. అదుపుత‌ప్పి ఎదురుగా వ‌స్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు యాత్రికులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ధార్వ‌డ్‌కు నుంచి ధ‌ర్మ‌స్థ‌ల‌కు మినీ ట్ర‌క్కులో డ్రైవ‌ర్‌తో స‌హా 9 మంది బ‌య‌ల్దేరారు. డ్రైవ‌ర్ సంజీవ్ అతి వేగంగా ట్ర‌క్కును న‌డిపించాడు. గురువారం తెల్ల‌వారుజామున 1.30 గంట‌ల స‌మ‌యంలో ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలోని అర‌బెయిల్ ఘాట్ సెక్ష‌న్‌లో మినీ ట్ర‌క్కు అదుపుత‌ప్పి ఎదురుగా వ‌స్తున్న లారీని ఢీకొట్టింది. స‌మాచారం అందుకున్న యెల్లాపూర్ పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం హుబ్బ‌లిలోని కిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement