NSE IPO | ఎన్ఎస్ఈ ఐపీఓకు సబ్స్క్రైబ్ చేయాలా.. నిపుణులు ఏమంటున్నారు..?
NSE IPO | ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) ఐపీఓ ఎట్టకేలకు ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రానుంది. దేశంలోనే ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ గా పేరుగాంచిన ఎన్ఎస్ఈ ఈ పబ్లిక్ ఇష్యూకు ఇప్పటికే రంగం సిద్ధం కాగా, పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా దీని కోసం ఎదురు చూస్తున్నారు.
NSE IPO | ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) ఐపీఓ ఎట్టకేలకు ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రానుంది. దేశంలోనే ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ గా పేరుగాంచిన ఎన్ఎస్ఈ ఈ పబ్లిక్ ఇష్యూకు ఇప్పటికే రంగం సిద్ధం కాగా, పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా దీని కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రకటించిన ప్రైస్ బ్యాండ్తో ఈ ప్రతిష్టాత్మక ఐపీఓ మార్కెట్లోకి రావడంపై ఉత్కంఠ పెరిగింది. ఎన్ఎస్ఈ ఐపీఓ సెప్టెంబర్ 17న ప్రారంభం కానుంగా, 21వ తేదీన ముగియనుంది. ఒక్కో ఈక్విటీ షేర్కు ప్రైస్ బ్యాండ్ను రూ.1700 నుంచి రూ.1785గా నిర్ణయించారు. ఒక్కో షేర్ ముఖ విలువ రూ.1గా ఉంటుంది.
ఆఫర్ ఫర్ సేల్ రూపంలోనే..
ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలోనే ఉండనుంది. అంటే ఎన్ఎస్ఈ నుంచి కొత్త షేర్ల జారీ ఉండదు. అందువల్ల ఐపీఓ ద్వారా సమీకరించే నిధులు ఎన్ఎస్ఈకి వెళ్లవు. ఆఫర్ ఖర్చులు, పన్నుల్లో ప్రతి విక్రయదారుడి వాటాను మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తం పూర్తిగా షేర్లను విక్రయిస్తున్న వాటాదారులకే వెళ్తుంది. ఎన్ఎస్ఈ ఐపీఓ షేర్ల కేటాయింపు సెప్టెంబర్ 22న జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉందని అంచనా. యాంకర్ ఇన్వెస్టర్లకు సెప్టెంబర్ 16న షేర్ల కేటాయింపు జరగనుంది. ఎక్కువకాలంగా ఎదురుచూస్తున్న ఎన్ఎస్ఈ ఐపీఓపై సబ్స్క్రైబ్ రేటింగ్ ప్రకటించిన తొలి బ్రోకరేజీ సంస్థగా శామ్కో సెక్యూరిటీస్ నిలిచింది. ఎన్ఎస్ఈ మార్కెట్ నాయకత్వం, బలమైన ఆర్థిక పరిస్థితి, అధిక మార్జిన్లు, రుణరహిత బ్యాలెన్స్ షీట్, నిర్మాణాత్మకంగా పెరుగుతున్న క్యాపిటల్ మార్కెట్ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని దీర్ఘకాలికంగా ఐపీఓకు సబ్స్క్రైబ్ చేయాలని శామ్కో సెక్యూరిటీస్ సూచించింది.
గరిష్ఠ ధర ఎంత..
ఐపీఓ గరిష్ఠ ధర రూ.1,785 వద్ద ఎన్ఎస్ఈ విలువ ఎఫ్వై2026 ఆదాయాల ఆధారంగా 42.89 రెట్లుగా ఉంటుందని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ రాజ్ గైకర్ తెలిపారు. ఎన్ఎస్ఈకు ఉన్న బలమైన మార్కెట్ స్థానం, లాభదాయకత, విస్తరణ సామర్థ్యం, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ విలువ సమర్థించదగినదేనని ఆయన పేర్కొన్నారు. శామ్కో సెక్యూరిటీస్ అభిప్రాయం ప్రకారం దేశంలోని అత్యంత బలమైన మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారాల్లో ఒకటైన ఎన్ఎస్ఈలో పెట్టుబడి పెట్టే అవకాశం ఈ ఐపీఓ ద్వారా లభిస్తుంది. బలమైన మార్కెట్ వాటా, లాభదాయకత, సాంకేతిక సామర్థ్యం, రుణరహిత బ్యాలెన్స్ షీట్ ఎన్ఎస్ఈకి ప్రధాన బలాలుగా ఉన్నాయి. అయితే డెరివేటివ్స్ విభాగంపై అధికంగా ఆధారపడడం కీలకమైన ప్రమాదంగా కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ భారీ స్థాయి, అధిక లిక్విడిటీ, సాంకేతిక మౌలిక వసతులు, సమగ్ర క్లియరింగ్ వ్యవస్థ, విస్తృత ఇన్వెస్టర్ బేస్ కలిగి ఉండడం సంస్థకు బలమైన పోటీ ప్రయోజనాన్ని కల్పిస్తాయని రాజ్ గైకర్ తెలిపారు.

బలమైన వృద్ధి..
రెడ్సీర్ నివేదిక ప్రకారం, ఎఫ్వై2001 నుంచి ఎఫ్వై2026 వరకు, అలాగే జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో క్యాష్ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్స్లో మొత్తం టర్నోవర్ పరంగా ఎన్ఎస్ఈ భారత్లో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్గా తన స్థానాన్ని కొనసాగించింది. ఇదే కాలంలో ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ కరెన్సీ డెరివేటివ్స్లోనూ మొత్తం టర్నోవర్ పరంగా దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్ఎస్ఈ మార్కెట్ ఆధిపత్యం గణనీయంగా ఉంది. ఎఫ్వై2026లో, అలాగే జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో భారత క్యాష్ మార్కెట్ టర్నోవర్లో ఎన్ఎస్ఈ వాటా వరుసగా 92.99 శాతం, 93.05 శాతంగా ఉంది. ఈక్విటీ ఫ్యూచర్స్లో 99.79 శాతం, 99.72 శాతం వాటా కలిగి ఉంది. ప్రీమియం టర్నోవర్ ఆధారంగా ఈక్విటీ ఆప్షన్స్లో 74.71 శాతం, 68.48 శాతం వాటా నమోదైంది. ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ కరెన్సీ ఫ్యూచర్స్లో ఎన్ఎస్ఈ వాటా వరుసగా 99.48 శాతం, 100 శాతంగా ఉండగా, కరెన్సీ ఆప్షన్స్లో రెండు కాలాల్లోనూ 100 శాతం వాటాను కలిగి ఉంది.
భారీగా ఇన్వెస్టర్ బేస్..
ఎన్ఎస్ఈకి భారీ ఇన్వెస్టర్ బేస్ కూడా ఉంది. జూన్ 30 నాటికి సంస్థ వద్ద 13.237 కోట్ల ప్రత్యేకంగా నమోదైన ఇన్వెస్టర్లు ఉన్నారు. ఎన్ఎస్ఈ సాంకేతిక వేదికను క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా గుర్తించారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈక్విటీలు, బాండ్లు, డెరివేటివ్స్, ఈటీఎఫ్లు, మ్యుచువల్ ఫండ్స్, రియాల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు వంటి విభాగాల్లో లావాదేవీలు కొనసాగుతున్నాయి. ప్రధాన విభాగాల్లో మైక్రోసెకండ్ స్థాయిలో ఆర్డర్ స్పందన, నానోసెకండ్ స్థాయిలో ఆర్డర్ అంగీకరణ సామర్థ్యాన్ని ఎన్ఎస్ఈ కలిగి ఉంది. ఎఫ్వై2024, ఎఫ్వై2025, ఎఫ్వై2026తోపాటు ఎఫ్వై2027 తొలి త్రైమాసికంలోనూ సంస్థ కార్యకలాపాలను ప్రభావితం చేసే డేటా భద్రత ఉల్లంఘనలు చోటుచేసుకోలేదని ఎన్ఎస్ఈ వెల్లడించింది.
గణనీయమైన ఆర్థిక వృద్ధి..
ఆర్థికంగా కూడా సంస్థ బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఎఫ్వై2024లో రూ.16,352.06 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఎఫ్వై2026లో రూ.18,713.37 కోట్లకు పెరిగింది. ఎఫ్వై2027 తొలి త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 13.10 శాతం పెరిగి రూ.4,560.41 కోట్లకు చేరింది. ఇదే సమయంలో పన్నుల అనంతర లాభం 6.71 శాతం పెరిగి రూ.3,120.08 కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్ ఈబీఐటీడీఏ రూ.3,594.25 కోట్లుగా ఉండగా, ఆపరేటింగ్ ఈబీఐటీడీఏ మార్జిన్ 78.81 శాతంగా ఉంది. సంస్థకు ఫండ్ ఆధారిత రుణాలు లేకపోవడంతోపాటు భారీ స్థాయిలో ట్రెజరీ పెట్టుబడులు ఉండడం కూడా ఎన్ఎస్ఈకి మరో ప్రధాన బలంగా ఉంది.
తాజావార్తలు
- ●BRICS Summit 2026 | భవిష్యత్తు మనదైతే.. నిర్ణయించే హక్కూ మనదే
- ●Malka Komuraiah | ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ రూపొందించాలి
- ● ఢిల్లీ BRICS వెనుక అసలు కథ.. పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న అంశాలివే!
- ●OU Students Protest | లక్ష డప్పులతో వస్తాం.. ఖబడ్దార్!
- ●Oracle | ఒరాకిల్లో మరోసారి లేఆఫ్స్.. ఇందుకోసం 700 మిలియన్ డాలర్ల ఖర్చు
- ●Vakiti Srihari | తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం

BRICS Summit 2026 | భవిష్యత్తు మనదైతే.. నిర్ణయించే హక్కూ మనదే

Malka Komuraiah | ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ రూపొందించాలి

ఢిల్లీ BRICS వెనుక అసలు కథ.. పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న అంశాలివే!

OU Students Protest | లక్ష డప్పులతో వస్తాం.. ఖబడ్దార్!





