Waterways Leisure Tourism IPO | వాటర్వేస్ లీజర్ టూరిజం ఐపీవోకు భారీ స్పందన.. అలాట్మెంట్ ఎప్పుడు..?
Waterways Leisure Tourism IPO | వాటర్వేస్ లీజర్ టూరిజం ఐపీఓ చివరి రోజు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం ఇష్యూ 1.63 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. కంపెనీ ఆఫర్ చేసిన 41.84 లక్షల షేర్లకు వ్యతిరేకంగా 68.36 లక్షల షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. తొలి రెండు రోజులలో స్పందన మందగించినప్పటికీ, రెండో రోజు ముగిసే సమయానికి కేవలం 50 శాతం మాత్రమే సబ్స్క్రిప్షన్ నమోదైంది.
Waterways Leisure Tourism IPO | వాటర్వేస్ లీజర్ టూరిజం ఐపీఓ చివరి రోజు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం ఇష్యూ 1.63 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. కంపెనీ ఆఫర్ చేసిన 41.84 లక్షల షేర్లకు వ్యతిరేకంగా 68.36 లక్షల షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. తొలి రెండు రోజులలో స్పందన మందగించినప్పటికీ, రెండో రోజు ముగిసే సమయానికి కేవలం 50 శాతం మాత్రమే సబ్స్క్రిప్షన్ నమోదైంది. అయితే చివరి రోజున బిడ్డింగ్ వేగం పెరగడంతో మొత్తం సబ్స్క్రిప్షన్ 1.63 రెట్లకు చేరుకుంది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో అత్యధిక ఆసక్తి కనిపించింది. ఈ కేటగిరీ 4.19 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్ఐఐ) కోటా 1.18 రెట్లు సబ్స్క్రైబ్ కాగా, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) కోటా 1.01 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. రూ.585 కోట్ల విలువైన ఈ బుక్-బిల్ట్ ఐపీఓను పూర్తిగా 72 లక్షల కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా తీసుకొచ్చారు. జూన్ 23 నుంచి 25 వరకు బిడ్డింగ్ కొనసాగింది. ఒక్కో షేరు ధరను రూ.769 నుంచి రూ.808 మధ్య నిర్ణయించారు. ఒక్క లాట్లో 18 షేర్లు ఉండగా, గరిష్ఠ ధర ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.14,544 పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది.
అలాట్మెంట్, లిస్టింగ్ తేదీలు ఇవే..
ఈ ఇష్యూకు సెంత్రమ్ బ్రోకింగ్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్గా వ్యవహరించగా, ఎంయూఎఫ్జీ ఇంటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్గా ఉంది. 2020 నవంబర్లో స్థాపించిన వాటర్వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్ దేశంలోని ప్రముఖ సముద్ర క్రూయిజ్ ఆపరేటర్లలో ఒకటిగా నిలిచింది. సంస్థ నిర్వహిస్తున్న ప్రధాన నౌక ఎంవీ ఎంప్రెస్ ముంబై, గోవా, కొచ్చి, చెన్నై, లక్షద్వీప్ తదితర దేశీయ మార్గాలతోపాటు శ్రీలంక, థాయ్లాండ్, సింగపూర్, మలేషియా వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా లగ్జరీ క్రూయిజ్ సేవలను అందిస్తోంది. అలాట్మెంట్ ప్రక్రియ సోమవారం, జూన్ 29న పూర్తయ్యే అవకాశం ఉంది. మొహర్రం సందర్భంగా శుక్రవారం బ్యాంక్ సెలవు ఉండటంతో శుక్రవారం కాకుండా సోమవారం అలాట్మెంట్ను ఖరారు చేయనున్నారు. వాటర్వేస్ లీజర్ టూరిజం ఐపీఓ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజ్లలో జూలై 1న లిస్ట్ కానున్నాయి. ఐపీఓలో దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లేదా ఎంయూఎఫ్జీ ఇంటైమ్ ఇండియా వెబ్సైట్లలో అలాట్మెంట్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు.
స్టేటస్ ను ఇలా తెలుసుకోవచ్చు..
బీఎస్ఈ వెబ్సైట్లో అలాట్మెంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే ముందుగా ఐపీఓ అలాట్మెంట్ పేజీకి వెళ్లాలి. అక్కడ ఈక్విటీని ఎంచుకుని వాటర్వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్ ను సెలెక్ట్ చేయాలి. అనంతరం అప్లికేషన్ నంబర్ లేదా పాన్ నంబర్ నమోదు చేసి, క్యాప్చా పూర్తి చేసి సెర్చ్ పై క్లిక్ చేస్తే అలాట్మెంట్ వివరాలు కనిపిస్తాయి. ఎన్ఎస్ఈ వెబ్సైట్లో ఐపీఓ అలాట్మెంట్ పేజీకి వెళ్లి ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ ఐపీవో బిడ్ డిటెయిల్స్ ను ఎంచుకోవాలి. తర్వాత కంపెనీ సింబల్ కార్డెల్లా (CORDELIA) ని సెలెక్ట్ చేసి, పాన్ నంబర్, అప్లికేషన్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే షేర్ అలాట్మెంట్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు. ఎంయూఎఫ్జీ ఇంటైమ్ ఇండియా అధికారిక వెబ్సైట్లోని ఐపీఓ అలాట్మెంట్ పేజీకి వెళ్లి కంపెనీ పేరును ఎంచుకోవాలి. అలాట్మెంట్ ఖరారైన తర్వాత మాత్రమే కంపెనీ పేరు జాబితాలో కనిపిస్తుంది. అనంతరం పాన్, అప్లికేషన్ నంబర్, డీపీ లేదా క్లయింట్ ఐడీ లేదా అకౌంట్ నంబర్ లేదా ఐఎఫ్ఎస్సీ వంటి వివరాల్లో ఏదో ఒకదాన్ని నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే స్టేటస్ను చూడవచ్చు.
జీఎంపీ బలహీన సంకేతాలు..
గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) మాత్రం బలహీనమైన లిస్టింగ్ సంకేతాలను ఇస్తోంది. జూన్ 26న ఉదయం 9 గంటల వరకు జీఎంపీ మైనస్ రూ.35గా నమోదైంది. దీంతో గరిష్ఠ ఇష్యూ ధర రూ.808తో పోలిస్తే సుమారు 4.33 శాతం డిస్కౌంట్ వద్ద, దాదాపు రూ.773 వద్ద లిస్టింగ్ జరిగే అవకాశం ఉందని గ్రే మార్కెట్ అంచనా వేస్తోంది. ఐపీఓ ప్రారంభమైన రోజున జీఎంపీ రూ.6గా ఉండగా, జూన్ 20న ఇది రూ.24 వరకు చేరింది. అనంతరం మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడటంతో జీఎంపీ క్రమంగా ప్రతికూల స్థాయికి చేరింది. అయితే గ్రే మార్కెట్ ప్రీమియం అధికారిక సూచిక కాదని, ఇది పూర్తిగా అనధికారిక మార్కెట్లోని అంచనాలు, ఊహాగానాల ఆధారంగా ఉంటుందని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేముందు నిపుణుల సలహాలు తప్పనిసరి.
తాజావార్తలు
- ●Malayalam OTT | ఓటీటీలోకి కాంట్రవర్సియల్ మలయాళం మూవీ - సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలే కథగా..
- ●Monsoon | రుతుపవనాల జాడేది?
- ●NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్ఎస్ఈ సీఈఓ కీలక సూచనలు..
- ●Shruthi Haasan | తండ్రి సినిమాలో యాక్టర్గా ఛాన్స్ - రిజెక్ట్ చేసిన శృతి హాసన్
- ●Chamala Kirankumar Reddy | అయోధ్య ట్రస్ట్తో రూ.200 కోట్లు మింగిర్రు
- ●Ecuador | 20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచకప్ నాకౌట్కు.. నేషనల్ హాలీడే ప్రకటించిన అధ్యక్షుడు డేనియల్ నొబోవా

Malayalam OTT | ఓటీటీలోకి కాంట్రవర్సియల్ మలయాళం మూవీ - సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలే కథగా..

Monsoon | రుతుపవనాల జాడేది?

NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్ఎస్ఈ సీఈఓ కీలక సూచనలు..

Shruthi Haasan | తండ్రి సినిమాలో యాక్టర్గా ఛాన్స్ - రిజెక్ట్ చేసిన శృతి హాసన్




