త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sensex | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య మ‌ళ్లీ మొద‌లైన ఉద్రిక్త‌త‌లు.. దేశీయ మార్కెట్లు లాభాల్లోనే..

Sensex | అమెరికా ఇరాన్‌పై సెల్ఫ్ డిఫెన్స్ దాడులు నిర్వహించిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో బలహీనత కనిపించినప్పటికీ, భారత‌ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం ప్రారంభ ట్రేడింగ్‌లో లాభాలతో కొనసాగాయి. గ్లోబల్ అనిశ్చితుల మధ్య కూడా దేశీయ ఈక్విటీ సూచీలు సానుకూల ధోరణి ప్రదర్శించాయి.

S

Business | Published On Jun 10, 2026, 10.17 am IST

Sensex | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య మ‌ళ్లీ మొద‌లైన ఉద్రిక్త‌త‌లు.. దేశీయ మార్కెట్లు లాభాల్లోనే..
Advertisement

Sensex | అమెరికా ఇరాన్‌పై సెల్ఫ్ డిఫెన్స్ దాడులు నిర్వహించిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో బలహీనత కనిపించినప్పటికీ, భారత‌ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం ప్రారంభ ట్రేడింగ్‌లో లాభాలతో కొనసాగాయి. గ్లోబల్ అనిశ్చితుల మధ్య కూడా దేశీయ ఈక్విటీ సూచీలు సానుకూల ధోరణి ప్రదర్శించాయి. ఉదయం 9:30 గంటల సమయంలో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 366.51 పాయింట్లు (0.50 శాతం) పెరిగి 74,285.27 వద్ద ట్రేడ్ అయింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 సూచీ 85.70 పాయింట్లు (0.37 శాతం) లాభపడి 23,327.80 వద్ద కొనసాగింది. సెన్సెక్స్‌లోని షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రారంభ ట్రేడింగ్‌లో అగ్రగాములుగా నిలిచాయి. అదే సమయంలో టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ షేర్లు వెనుకబడ్డాయి. విస్తృత మార్కెట్ కూడా సానుకూలంగానే కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.01 శాతం పెరగగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 0.25 శాతం లాభపడింది.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు, ప‌త‌న‌మైన రూపాయి విలువ‌..

అమెరికా హోర్ముజ్ జలసంధిపై గస్తీ నిర్వహిస్తున్న అపాచీ మిలిటరీ హెలికాప్టర్ కూల్చివేత అనంతరం ఇరాన్‌పై స్వీయ రక్షణ చర్యల పేరుతో దాడులు చేపట్టింది. దీనికి ప్రతిస్పందనగా తాము చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలపై పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ఇక కరెన్సీ మార్కెట్లో రూపాయి బలహీనపడింది. ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు క్షీణించి 95.56 వద్ద ట్రేడ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ దేశీయ మార్కెట్‌కు ప్రతికూల ప్రారంభ సంకేతాలు ఇచ్చింది. అయితే ట్రేడింగ్ సెషన్‌లో నిఫ్టీ స్పాట్ సూచీ 23,000 నుంచి 23,400 పాయింట్ల పరిధిలో కదలాడే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేశాయి. అమెరికా వాల్ స్ట్రీట్ మార్కెట్లు మంగళవారం మిశ్రమ ధోరణిలో ముగిశాయి. స్మాల్‌క్యాప్ స్టాక్స్, సాంప్రదాయ వాల్యూ సెక్టార్లు స్వల్ప లాభాలు నమోదు చేసినప్పటికీ, లార్జ్‌క్యాప్ టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో ప్రధాన సూచీల లాభాలు పరిమితమయ్యాయి. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.37 శాతం పెరిగి బ్యారెల్‌కు 91 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.24 శాతం పెరిగి బ్యారెల్‌కు 87 డాల‌ర్ల వ‌ద్ద నిలిచింది.

Advertisement
Advertisement