త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SEBI | 12 భారీ ఐపీవోల‌కు సెబీ అనుమ‌తి.. పెట్టుబ‌డి దారుల‌కు పండ‌గే..

SEBI | క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) తాజాగా 12 కంపెనీల ప్రాథమిక పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ప్రణాళికలకు అనుమతి ఇచ్చింది. శుక్రవారం విడుదలైన నియంత్రణ అప్‌డేట్ ప్రకారం, ఈ సంస్థలు జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో సెబీకి డ్రాఫ్ట్ ఐపీఓ పత్రాలు సమర్పించగా, జనవరి 19 నుంచి 23 మధ్య సెబీ తన పరిశీలనలను తెలియజేసింది.

S

Business | Published On Jan 24, 2026, 10.33 am IST

SEBI | 12 భారీ ఐపీవోల‌కు సెబీ అనుమ‌తి.. పెట్టుబ‌డి దారుల‌కు పండ‌గే..
Advertisement

SEBI | క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) తాజాగా 12 కంపెనీల ప్రాథమిక పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ప్రణాళికలకు అనుమతి ఇచ్చింది. శుక్రవారం విడుదలైన నియంత్రణ అప్‌డేట్ ప్రకారం, ఈ సంస్థలు జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో సెబీకి డ్రాఫ్ట్ ఐపీఓ పత్రాలు సమర్పించగా, జనవరి 19 నుంచి 23 మధ్య సెబీ తన పరిశీలనలను తెలియజేసింది. నియంత్రణ పరంగా దీన్ని పబ్లిక్ ఇష్యూ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్‌గా భావిస్తారు. సెబీ ఆమోదం పొందిన కంపెనీల్లో ఇన్‌ఫ్రా మార్కెట్ పేరెంట్ కంపెనీ అయిన హెల్లా ఇన్‌ఫ్రా మార్కెట్, పర్పుల్ స్టైల్ ల్యాబ్స్, జయ్ జగదాంబ లిమిటెడ్, యూకేబీ ఎలక్ట్రానిక్స్, సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్, ట్రాన్స్‌లైన్ టెక్నాలజీస్, మెడిక్యాప్ హెల్త్‌కేర్, ఓస్వాల్ కేబుల్స్, బీవీజీ ఇండియా, సాయి ప్యారెంటరల్స్, కామ్టెల్ నెట్‌వర్క్స్, సిఫై ఇన్ఫినిట్ స్పేసెస్ ఉన్నాయి.

రూ.5500 కోట్ల‌తో హెల్లా ఇన్‌ఫ్రా మార్కెట్..

టైగర్ గ్లోబల్ మద్దతుతో పనిచేస్తున్న ఇన్‌ఫ్రా మార్కెట్ పేరెంట్ సంస్థ హెల్లా ఇన్‌ఫ్రా మార్కెట్ రూ.4,500 కోట్ల నుంచి రూ.5,500 కోట్ల మధ్య ఐపీఓకు సిద్ధమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సంస్థ సెబీ గోప్యమైన ప్రీ-ఫైలింగ్ మార్గంలో పత్రాలు దాఖలు చేసింది. ఈ ఇష్యూ తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు ప్రస్తుత వాటాదారుల నుంచి షేర్ల విక్రయానికి (ఆఫర్ ఫర్ సేల్) మిశ్రమంగా ఉండనుంది. సిఫై టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అయిన సిఫై ఇన్ఫినిట్ స్పేసెస్ రూ.2,500 కోట్ల తాజా ఈక్విటీ ఇష్యూ, రూ.1,200 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ కలిపి మొత్తం భారీ పబ్లిక్ ఇష్యూ చేయాలని ప్రణాళిక రూపొందించింది. లగ్జరీ ఫ్యాషన్ ప్లాట్‌ఫాం పెర్నియాస్ పాప్-అప్ షాప్ నిర్వహించే పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ పూర్తిగా తాజా షేర్ల జారీ ద్వారానే రూ.660 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రూ.400 కోట్ల‌తో యూకేబీ ఎల‌క్ట్రానిక్స్‌..

వీడియో సర్వేలెన్స్, బయోమెట్రిక్ సొల్యూషన్లు అందించే ట్రాన్స్‌లైన్ టెక్నాలజీస్ మాత్రం 1.62 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, వాటాదారులు విక్రయించే ఆఫర్ ఫర్ సేల్ రూపంలోనే మార్కెట్‌కు రావాలని నిర్ణయించింది. నోయిడాకు చెందిన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ యూకేబీ ఎలక్ట్రానిక్స్ రూ.400 కోట్ల తాజా ఇష్యూ, మరో రూ.400 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్‌తో ఐపీఓకు సిద్ధమైంది. నాన్-ఫెరస్ మెటల్ రీసైక్లింగ్ రంగంలో ఉన్న సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం 4.28 కోట్ల ఈక్విటీ షేర్లను పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించనుంది. ఓస్వాల్ కేబుల్స్ రూ.300 కోట్ల తాజా షేర్ల జారీతో పాటు 2.22 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నిధులు సమీకరించాలని భావిస్తోంది. తాజా ఇష్యూ ద్వారా వచ్చే నిధులను కొత్త ప్రాజెక్టు ఏర్పాటు, రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

రూ.900 కోట్ల‌తో కామ్టెల్ నెట్‌వ‌ర్క్స్‌..

సదుపాయాల నిర్వహణ సేవల సంస్థ బీవీజీ ఇండియా రూ.300 కోట్ల తాజా ఇష్యూ, 2.85 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్‌తో ఐపీఓకి వస్తోంది. అలాగే కామ్టెల్ నెట్‌వర్క్స్ రూ.900 కోట్ల పబ్లిక్ ఇష్యూ ప్రణాళిక రూపొందించింది. ఇందులో రూ.150 కోట్లు తాజా ఇష్యూ కాగా, రూ.750 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉంటాయి. తాజా ఇష్యూ ద్వారా వచ్చే నిధులను ప్రధానంగా రుణాలను తీర్చడానికి వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ 12 కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం లభించడంతో రానున్న నెలల్లో ప్రాథమిక మార్కెట్ మరింత ఉత్సాహంగా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పెద్ద మొత్తంలో నిధుల సమీకరణతో పాటు వివిధ రంగాలకు చెందిన కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టడం పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచనుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement