త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి రూ.84,500 కోట్లు..! ఆర్‌బీఐ కీల‌క నిర్ణ‌యం..!

RBI | దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. వేరియబుల్ రేట్ రెపో (వీఆర్‌ఆర్) వేలం ద్వారా సోమవారం భారీగా నిధులను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

P

Business | Published On Mar 30, 2026, 10.30 pm IST

RBI | బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి రూ.84,500 కోట్లు..! ఆర్‌బీఐ కీల‌క నిర్ణ‌యం..!
Advertisement

RBI | దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. వేరియబుల్ రేట్ రెపో (వీఆర్‌ఆర్) వేలం ద్వారా సోమవారం భారీగా నిధులను మార్కెట్‌లోకి విడుదల చేసింది. మొత్తం రూ.84,582 కోట్ల మేర బ్యాంకులకు అందించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీనికి ప్ర‌ధాన కార‌ణంగా బ్యాంకుల వ‌ద్ద లిక్విడిటీ పెంచి, ఆర్థిక వ్యవస్థలో రుణాల ప్రవాహం సజావుగా కొనసాగించడమేనని సెంట్ర‌ల్ బ్యాంకు తెలిపింది. ఆర్‌బీఐ వివ‌రాల ప్ర‌కారం.. తొలి వీఆర్‌ఆర్ వేలంలో సుమారు రూ.50,001 కోట్లను 5.44 శాతం సగటు వడ్డీ రేటుతో అందించింది. రెండో వేలంలో రూ.34,581 కోట్లను 5.30 శాతం రేటుకు విడుదల చేసింది. మొదటి వేలానికి బ్యాంకుల నుంచి మంచి స్పందన లభించగా.. రెండో విడతలో మాత్రం అంచనాలకు తగ్గ బిడ్లు మాత్రమే వచ్చాయి.

ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థలో మార్చి 27 నాటికి సుమారు రూ.1.27 లక్షల కోట్ల మేర అదనపు నిధులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆర్బీఐ వీఆర్‌ఆర్ వేలాల ద్వారా రూ.2.73 లక్షల కోట్లకుపైగా తాత్కాలిక లిక్విడిటీని అందించింది. అంతేకాకుండా ఈ ఏడాది జనవరి నుంచి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ల (ఓఎంఓ) ద్వారా ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్ల ద్వారా రూ.3.50 లక్షల కోట్ల స్థిర లిక్విడిటీని కూడా వ్యవస్థలోకి తీసుకువచ్చింది. మ‌రో వైపు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తొలి ఆరు నెలల రుణ సేకరణ ప్రణాళికను ప్రకటించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.8.20 లక్షల కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ నిధులను డేటెడ్ సెక్యూరిటీస్‌, సావరిన్ గ్రీన్ బాండ్ల జారీ ద్వారా సమీకరించనున్నట్లు తెలిపింది. ఈ అంశంపై ఆర్బీఐతో సంప్రదింపుల అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజావార్తలు

Advertisement