త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Razorpay IPO | రేజర్‌పే ఐపీఓ వ‌చ్చేస్తోంది.. రూ.5,700 కోట్లతో భారీ ఎంట్రీ..

Razorpay IPO | భారత ఫిన్‌టెక్ రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగిన రేజ‌ర్ పే (Razorpay) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఓ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. కంపెనీ మూలాల సమాచారం ప్రకారం, రేజర్‌పే సుమారు 600 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,700 కోట్లు) విలువైన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం భారత మూలధన మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) వద్ద గోప్యంగా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసిన‌ట్లు వెల్ల‌డైంది.

S

Business | Published On Jun 15, 2026, 3.39 pm IST

Razorpay IPO | రేజర్‌పే ఐపీఓ వ‌చ్చేస్తోంది.. రూ.5,700 కోట్లతో భారీ ఎంట్రీ..
Advertisement

Razorpay IPO | భారత ఫిన్‌టెక్ రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగిన రేజ‌ర్ పే (Razorpay) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఓ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. కంపెనీ మూలాల సమాచారం ప్రకారం, రేజర్‌పే సుమారు 600 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,700 కోట్లు) విలువైన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం భారత మూలధన మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) వద్ద గోప్యంగా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసిన‌ట్లు వెల్ల‌డైంది. సోమవారం విడుదల చేసిన పబ్లిక్ నోటీసులో, కంపెనీ ప్రతిపాదిత మెయిన్‌బోర్డ్ ఐపీఓకు సంబంధించి ప్రీ-ఫైల్డ్ డీఆర్‌హెచ్‌పీని సెబీతోపాటు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించినట్లు వెల్లడించింది. గోప్య ఫైలింగ్ విధానం ద్వారా కంపెనీలు తమ వ్యాపారానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వెంటనే బహిర్గతం చేయకుండా సెబీ సమీక్ష కోసం పత్రాలను సమర్పించే అవకాశం ఉంటుంది.

తాజా షేర్లు, ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్‌..

రేజర్‌పే ఐపీఓలో 300 మిలియన్ డాలర్ల విలువైన తాజా షేర్ల జారీ (ఫ్రెష్ ఇష్యూ)తోపాటు మరో 300 మిలియన్ డాలర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ఉంటుంది. దీంతో ఇప్పటికే కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించే అవకాశం పొందనున్నారు. బెంగళూరుకు చెందిన ఈ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పబ్లిక్ మార్కెట్‌లో ప్రవేశించే సమయంలో 5 నుంచి 6 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా నిర్ణ‌యించుకున్న‌ట్లు సమాచారం. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరాంతానికి ముందే స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ పూర్తి చేయాలని కంపెనీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఐపీఓ నిర్వహణ కోసం యాక్సిస్ క్యాపిట‌ల్‌, సిటి గ్రూప్‌, గోల్డ్‌మ‌న్ సాక్స్‌, జేపీ మోర్గాన్ చేజ్‌, మ‌హీంద్రా క్యాపిట‌ల్ లను లీడ్ బ్యాంకర్లుగా నియమించింది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు మార్గం సుగమం చేసేందుకు రేజర్‌పే మే 2025లో కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన కార్పొరేట్ డొమిసైల్, గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌ను అమెరికా నుంచి తిరిగి భారత్‌కు మార్చే రివర్స్ ఫ్లిప్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణకు షేర్‌హోల్డర్ల నుంచి అధికారిక ఆమోదం పొందింది.

ఒకే వేదిక‌పై ఎన్నో సేవ‌లు..

2020లో యూనికార్న్ హోదా సాధించిన రేజర్‌పే, కేవలం పేమెంట్స్ సేవలకే పరిమితం కాకుండా వ్యాపారాల కోసం సమగ్ర ఆర్థిక సేవల వేదికగా విస్తరించింది. కలెక్షన్స్, పేఔట్స్, పేరోల్, క్యాష్ ఫ్లో మేనేజ్‌మెంట్, రుణాల సదుపాయం వంటి సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందిస్తోంది. స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా సంస్థలు, పెద్ద కార్పొరేట్ కంపెనీలు సహా దేశవ్యాప్తంగా లక్షలాది వ్యాపారాలు ఈ సంస్థ సేవలను వినియోగిస్తున్నాయి. 2014లో హ‌ర్షిల్ మ‌థుర్‌, శశాంక్ కుమార్ రేజర్‌పేను స్థాపించారు. ప్రస్తుతం కంపెనీకి పీక్ ఎక్స్‌వీ పార్ట్‌న‌ర్స్‌, జీఐసీ, టైగ‌ర్ గ్లోబ‌ల్ మేనేజ్‌మెంట్‌, వై కాంబినేట‌ర్‌, సేల్స్‌ఫోర్స్ వెంచ‌ర్స్‌, లైట్ స్పీడ్ వెంచ‌ర్ పార్ట్‌న‌ర్స్ వంటి ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల మద్దతు ఉంది. వీరిలో చాలామంది ఓఎఫ్‌ఎస్ లో భాగంగా తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement