Stock Markets | యుద్ధ తీవ్రత పెరిగినా.. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు..
Stock Markets | పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల్లోనే కొనసాగుతున్నాయి. క్రితం సెషన్లో భారీగా పతనమైన సూచీలు ఇవాళ్టి సెషన్లో లాభాల బాట పట్టాయి. ఉదయం అన్ని సూచీలు గ్యాప్ అప్తో ప్రారంభం అవగా సెన్సెక్స్ ప్రస్తుతం 751 పాయింట్లు (1.04 శాతం) పెరిగి 75,000 మార్క్కు చేరువలో ట్రేడ్ అవుతోంది.
Stock Markets | పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల్లోనే కొనసాగుతున్నాయి. క్రితం సెషన్లో భారీగా పతనమైన సూచీలు ఇవాళ్టి సెషన్లో లాభాల బాట పట్టాయి. ఉదయం అన్ని సూచీలు గ్యాప్ అప్తో ప్రారంభం అవగా సెన్సెక్స్ ప్రస్తుతం 751 పాయింట్లు (1.04 శాతం) పెరిగి 75,000 మార్క్కు చేరువలో ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ50 సూచీ 246 పాయింట్లు (1.07 శాతం) ఎగబాకి 23,250 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు మాత్రం లాభాల్లో ఉన్నాయి. మరోవైపు ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా చమురు ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అవి భారత రూపాయి మారకం విలువపై ప్రభావం చూపిస్తున్నాయి. రూపాయి విలువ పతనం అయ్యేందుకు చమురు ధరలు కారణం అవుతున్నాయి.
రూపాయి విలువ మరింత పతనం..
ప్రస్తుతం అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ 28 పైసలు తగ్గి 93.16 ఆల్టైమ్ హైలో కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు పతనం అయ్యాయి. కానీ దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల్లోనే ఉన్నాయి. ఇక ఆసియా మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతూ మిశ్రమ ఫలితాలతో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే షాంఘై స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
భగ్గుమంటున్న చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకీ భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.45 శాతం తగ్గి 103 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 0.69 శాం తగ్గి 93 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం ముగిసిన అమెరికా మార్కెట్ డేటా ప్రకారం యూఎస్10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరగా, భారత మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడిదారులు నిధులను ఉపసంహరించుకున్నారు. గురువారం నాటి సెషన్లోనే వారు ఏకంగా రూ.7558 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అయితే మార్కెట్లు భారీగా పతనం అవడం వల్ల లార్జ్ క్యాప్ షేర్లు ఆకర్షణీయంగా మారాయని, అందుకనే తాత్కాలికంగా పెట్టుబడిదారులు కొనుగోళ్లు చేస్తుండడంతో మార్కెట్లలో లాభాలు కనిపిస్తున్నాయని, యుద్ధం ముగిస్తే తప్ప మార్కెట్లకు మళ్లీ మంచి రోజులు రావని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



