త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Market | బోరింగ్ మార్కెట్.. ఉదయం ట్రేడ్ చేసిన వాళ్లే లక్కీ.. ఆ తర్వాత సైడ్‌వేస్

ఇక బ్యాంకింగ్ స్టాక్స్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ 59,304 వద్ద ముగిసింది. ఓవరాల్‌గా ఇవాళ 234 పాయింట్లు పైకి వెళ్లింది. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్‌లో ఓపెన్ కావడంతో కొందరు ట్రేడర్లకు కలిసివచ్చింది.

J

Business | Published On Dec 22, 2025, 4.03 pm IST

Stock Market | బోరింగ్ మార్కెట్.. ఉదయం ట్రేడ్ చేసిన వాళ్లే లక్కీ.. ఆ తర్వాత సైడ్‌వేస్
Advertisement

Stock Market | ఇండియన్ స్టాక్ మార్కెట్ 22 డిసెంబర్ 2025, సోమవారం ఓపెన్ అవడమే గ్యాప్ అప్‌తో ఓపెన్ అయింది. అది ఒక్కటే ట్రేడర్స్‌కి కలిసి వచ్చింది. గ్యాప్ అప్‌లో ఓపెన్ అవడంతో పాటు తొలి 10 నిమిషాలు జెట్ స్పీడ్‌లో పైకి దూసుకెళ్లడంతో ట్రేడర్స్, ఇన్వెస్టర్లు ఉత్సాహంతో స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఉదయం 9.30 తర్వాత ఇక మార్కెట్ ఎటూ కదలకుండా ఉండిపోయింది. మధ్యాహ్నం 2.30 వరకు కూడా సైడ్‌వేస్‌లోనే ఉంది. దీంతో కాల్, పుట్ రెండు వైపుల ట్రేడ్ చేసేందుకు ప్రయత్నించిన చాలా మంది ట్రేడర్లు, టైమ్ డికే వల్ల నష్టపోవాల్సి వచ్చింది.

గ్యాప్ అప్‌తో 26,055 వద్ద ఓపెన్ అయిన ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 50 ఓ 70 నుంచి 80 పాయింట్ల వరకు బాగానే మూవ్ అయింది. ఆ తర్వాత సైడ్ వేస్‌ అయింది. లాస్ట్‌కి మార్కెట్ ముగిసే ముందు కాస్త పైకి వెళ్లినట్టు అనిపించినా బోరింగ్ మార్కెట్‌గానే ఈ రోజు క్లోజ్ అయింది. ఇవాళ నిప్టీ 50.. 26,172 వద్ద క్లోజ్ అయింది. 26,180 వరకు పైకి వెళ్లి మళ్లీ కిందికి వచ్చింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ రోజు గ్యాప్ అప్ అవడం వల్ల నిఫ్టీ 206 పాయింట్లు పైకి ఎగబాకింది.

Stock Market | 59,304 వద్ద ముగిసిన బ్యాంక్ నిఫ్టీ

ఇక బ్యాంకింగ్ స్టాక్స్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ 59,304 వద్ద ముగిసింది. ఓవరాల్‌గా ఇవాళ 234 పాయింట్లు పైకి వెళ్లింది. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్‌లో ఓపెన్ కావడంతో కొందరు ట్రేడర్లకు కలిసివచ్చింది.

బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ కూడా ఇవాళ సేమ్ టు సేమ్ నిఫ్టీ లాగానే ప్రవర్తించింది. 638 పాయింట్ల పైకి వెళ్లి 85,567.48 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం బీటీఎస్‌టీతో కాల్ ట్రేడ్‌ని క్యారీ ఫార్వార్డ్ చేసిన వాళ్లు మాత్రమే ఈరోజు లాభపడ్డారు. మిగితా వాళ్లు నష్టపోయారు.

Advertisement

తాజావార్తలు

Advertisement