Stock Markets | స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కంటిన్యూ.. భారీగా పతనమైన సూచీలు..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పతనం అయ్యాయి. మార్కెట్లలో భారీ స్థాయిలో అమ్మకాలు చోటు చేసుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు 1 శాతం కన్నా ఎక్కువగా పడిపోయాయి. సెన్సెక్స్ 1,200 పాయింట్లు (1.6 శాతం) క్షీణించి ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 72,392కి చేరింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పతనం అయ్యాయి. మార్కెట్లలో భారీ స్థాయిలో అమ్మకాలు చోటు చేసుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు 1 శాతం కన్నా ఎక్కువగా పడిపోయాయి. సెన్సెక్స్ 1,200 పాయింట్లు (1.6 శాతం) క్షీణించి ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 72,392కి చేరింది. నిఫ్టీ 50 కూడా 350 పాయింట్లు (1.5 శాతం) తగ్గి 22,470 వద్దకు చేరుకుంది. BSEలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా సెషన్లో 1 శాతం కంటే ఎక్కువగానే పతనమయ్యాయి. కొద్ది నిమిషాల్లోనే పెట్టుబడిదారులు సుమారు రూ.5 లక్షల కోట్లు కోల్పోయారు. BSEలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.422 లక్షల కోట్ల నుంచి రూ.417 లక్షల కోట్లకు పడిపోయింది.
యుద్ధం ముగింపుపై రాని స్పష్టత..
ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇరాన్ యుద్ధం నెల రోజులు దాటినా త్వరలో ముగుస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేసినా, యుద్ధానికి పూర్తి పరిష్కారం దిశగా పెద్దగా పురోగతి లేదు. మీడియా కథనాల ప్రకారం ట్రంప్ ప్రభుత్వం ఇరాన్కు 15 పాయింట్ల ceasefire ప్రణాళికను పంపింది. అయినప్పటికీ ఇప్పటివరకు అధికారిక చర్చలు జరగలేదు. రెండు దేశాలు మధ్యవర్తుల ద్వారా ముఖ్యంగా పాకిస్తాన్ సహకారంతో పరోక్షంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీలు కూడా ఈ యుద్ధంలో చేరారు. Bloomberg నివేదిక ప్రకారం అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఆగే వరకు తమ చర్యలు కొనసాగిస్తామని ఇరాన్, హౌతీలు ప్రకటించాయి.
భారత్ ముందు అనేక సవాళ్లు..
జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రధాన వ్యూహకర్త వి.కే. విజయకుమార్ మాట్లాడుతూ పశ్చిమ ఆసియాలో యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. హౌతీలు కూడా యుద్ధంలో చేరడం, అమెరికా అదనపు సైన్యాన్ని పంపడం పరిస్థితిని క్లిష్టం చేస్తోందని అన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధంపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 115 డాలర్లకు పైగా చేరాయి. ప్రపంచ చమురు, LNG సరఫరాలో సుమారు 20 శాతం జరిగే హోర్ముజ్ జలసంధి ఇప్పటికీ చాలా వరకు మూసివేసే ఉంది. పాక్షికంగా నౌకలు ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు కావడంతో ఈ ధరల పెరుగుదల దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దేశం తన చమురు అవసరాల్లో 85-90 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది.
విజయకుమార్ మాట్లాడుతూ బ్రెంట్ క్రూడ్ మళ్లీ 116 డాలర్లకు చేరిందని, యుద్ధానికి ముందు ఉన్న అనుకూల ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యాయని అన్నారు. అధిక GDP వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల స్థానంలో ఇప్పుడు తక్కువ వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం, అధిక లోటు వంటి సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు వెనక్కి..
పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) నిరంతరంగా భారత మార్కెట్ నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. NSDL డేటా ప్రకారం మార్చి 27 వరకు వారు రూ.1,23,025 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మార్చి 15తో ముగిసిన పక్షంలో విదేశీ పెట్టుబడిదారుల ఈక్విటీ ఆస్తులు 79 బిలియన్ డాలర్ల మేర తగ్గి 710 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది గత ఆరు సంవత్సరాల్లోనే అత్యధిక పతనం కాగా, కోవిడ్ సమయంలో వచ్చిన అమ్మకాల కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



