త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. 24,100 దిగువకు నిఫ్టీ..

Stock Markets | దేశీయ కీలక ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో స్వల్ప నష్టాల్లో కొనసాగాయి. నిఫ్టీ 24,100 స్థాయి దిగువన ట్రేడైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో హెల్త్‌కేర్, రియల్టీ, ఫార్మా షేర్లు క్షీణించగా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, మీడియా రంగాల షేర్లు లాభపడ్డాయి. ఉదయం 9:30 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 39.69 పాయింట్లు (0.05 శాతం) తగ్గి 76,917.58 వద్ద ఉంది.

S

Business | Published On Sep 1, 2026, 10.15 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. 24,100 దిగువకు నిఫ్టీ..
Advertisement

Stock Markets | దేశీయ కీలక ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో స్వల్ప నష్టాల్లో కొనసాగాయి. నిఫ్టీ 24,100 స్థాయి దిగువన ట్రేడైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో హెల్త్‌కేర్, రియల్టీ, ఫార్మా షేర్లు క్షీణించగా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, మీడియా రంగాల షేర్లు లాభపడ్డాయి. ఉదయం 9:30 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 39.69 పాయింట్లు (0.05 శాతం) తగ్గి 76,917.58 వద్ద ఉంది. నిఫ్టీ 50 సూచీ 28.70 పాయింట్లు (0.12 శాతం) నష్టపోయి 24,056.70 వద్ద ట్రేడైంది. విస్తృత మార్కెట్‌ల‌లో బీఎస్‌ఈ 150 మిడ్‌క్యాప్ సూచీ 0.30 శాతం పడిపోగా, బీఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్ సూచీ 0.02 శాతం నష్టపోయింది. మార్కెట్‌లో బ్రెడ్‌త్ మాత్రం పాజిటివ్‌గా ఉంది. బీఎస్‌ఈలో 1,592 షేర్లు లాభపడగా, 1,433 షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. మరో 213 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

ఆగ‌స్టులో పెరిగిన ఎఫ్‌పీఐల కొనుగోళ్లు..

ఆగస్టు నెలలో 31వ తేదీ వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్లలో రూ.17,366 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. జూలైలో వారు నికరంగా రూ.6,731.97 కోట్ల నగదు పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు జూన్‌లో మాత్రం రూ.53,957.90 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు. షేర్లలో లీప్ ఇండియా 2.77 శాతం పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 30.3 శాతం పెరిగి రూ.24.7 కోట్లకు చేరింది. గ‌త ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.19 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 19.1 శాతం పెరిగి రూ.170.8 కోట్ల నుంచి రూ.203.4 కోట్లకు చేరింది. మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ షేరు 6.31 శాతం దూసుకెళ్లింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 889.9 శాతం పెరిగి రూ.64.7 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.6.5 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 43.6 శాతం పెరిగి రూ.678.1 కోట్ల నుంచి రూ.973.4 కోట్లకు చేరింది.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

ఈ2ఈ నెట్‌వర్క్స్ షేరు 3.27 శాతం లాభపడింది. ఎన్విడియా బ్లాక్‌వెల్ క్లౌడ్ జీపీయూలు, అనుబంధ సేవలను అందించేందుకు భారత్‌కు చెందిన ఒక సావరిన్ ఏఐ కంపెనీతో బైండింగ్ టర్మ్ షీట్‌పై కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ వర్తించే పన్నులు మినహాయించి సుమారు రూ.1వేయి కోట్లుగా ఉంది. ఈ ఒప్పందం జూన్ 2029 వరకు అమల్లో ఉంటుంది.భారత్‌కు చెందిన 10 ఏళ్ల బెంచ్‌మార్క్ ప్రభుత్వ సెక్యూరిటీపై ఈల్డ్ మునుపటి సెషన్ ముగింపు 6.947తో పోలిస్తే 0.17 శాతం పెరిగి 6.959కి చేరింది. విదేశీ మారక మార్కెట్‌లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా బలపడింది. పాక్షికంగా కన్వర్టిబుల్ రూపాయి మునుపటి ట్రేడింగ్ సెషన్‌లో 95.2200 వద్ద ముగియగా, ప్రస్తుతం 95.0050 వద్ద ఉంది. ఇక కమోడిటీ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 0.71 శాతం పెరిగి బ్యారెల్‌కు 91.13 డాలర్లకు చేరింది. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ప్రారంభమైన ఘర్షణలు హోర్ముజ్ జలసంధి భవిష్యత్ పరిస్థితులపై అనిశ్చితిని మరింత పెంచాయి. ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన భాగం సాధారణంగా ఈ మార్గం గుండా సాగుతుంది. అయితే ఘర్షణల కారణంగా షిప్పింగ్ కార్యకలాపాలు భారీగా తగ్గాయి. దీంతో భవిష్యత్తులో చమురు సరఫరాలో మరింత అంతరాయం ఏర్పడే అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

Advertisement
Advertisement