Stock Markets | మళ్లీ మొదలైన అమెరికా-ఇరాన్ యుద్ధం.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
Stock Markets | దేశీయ బెంచ్మార్క్ సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. మరోవైపు ఎంఎస్సీఐ ఇండెక్స్ రీజిగ్ కారణంగా మార్కెట్లో మరింత ఒడిదుడుకులు ఉంటాయని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
Stock Markets | దేశీయ బెంచ్మార్క్ సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. మరోవైపు ఎంఎస్సీఐ ఇండెక్స్ రీజిగ్ కారణంగా మార్కెట్లో మరింత ఒడిదుడుకులు ఉంటాయని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ 300.77 పాయింట్లు (0.39 శాతం) నష్టపోయి 76,963.74 వద్ద ట్రేడైంది. మరోవైపు నిఫ్టీ 132.55 పాయింట్లు (0.55 శాతం) పతనమై 24,043.10 వద్ద కొనసాగింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరగడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. అమెరికా బలగాలు ఇరాన్కు చెందిన రెండు లాంచర్లపై దాడులు చేశాయి. జూలై చివరి తర్వాత ఇరాన్పై అమెరికా జరిపిన తొలి దాడులుగా వీటిని పేర్కొంటున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
భారీగా పెరిగిన చమురు ధరలు..
బ్రెంట్ క్రూడ్ ధర 2.20 శాతం పెరిగి బ్యారెల్కు 89 డాలర్లకు చేరింది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 2.18 శాతం మేర పెరిగి బ్యారెల్కు 85 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ మరోమారు పతనమైంది. అమెరికా డాలర్తో పోలిస్తే 95.43 వద్ద ఉన్న రూపాయి ఈ సెషన్లో 0.07 శాతం మేర నష్టపోయింది. ఇక ఆసియా మార్కెట్లు కూడా సుమారు 0.7 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య తాజాగా చోటుచేసుకున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలపై ఆందోళనలు మళ్లీ పెరిగాయి. దీంతో ఆసియా ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. జపాన్కు చెందిన నిక్కీ సూచీ 2.1 శాతం పడిపోగా, దక్షిణ కొరియా ఈక్విటీలు 2.4 శాతం క్షీణించాయి. జపాన్ మినహా ఆసియా-పసిఫిక్ షేర్ల ఎంఎస్సీఐ విస్తృత సూచీ 0.7 శాతం పతనమైంది. అమెరికా ఈక్విటీ ఫ్యూచర్స్ కూడా బలహీనంగా కనిపించాయి. ఎస్అండ్పీ 500 ఫ్యూచర్స్ 0.3 శాతం, నాస్డాక్ ఫ్యూచర్స్ 0.5 శాతం నష్టపోయాయి.
కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు..
దేశీయ మార్కెట్లపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు కూడా ఒత్తిడిని పెంచుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఎఫ్ఐఐలు భారత ఈక్విటీల్లో రూ.5వేల కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయంగా రిస్క్ తీసుకునే ఆసక్తి తగ్గుతున్న సమయంలో ఈ భారీ విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ భారత మార్కెట్లకు మరో ప్రతికూల అంశంగా మారింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Seed Ganesha | గణనాథుడిని పూజిద్దాం.. మొక్కలను నాటుదాం.. ప్రకృతిని కాపాడుదాం..
- ●Driving Licence | మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్.. ఇకపై ఆ పాఠాలు వినాల్సిందే!
- ●Road Accident | లారీని ఢీకొట్టిన మినీ బస్సు.. డ్రైవర్ సహా ఆరుగురు దుర్మరణం
- ●Moosarambagh Bridge | ఎట్టకేలకు ముగిసిన ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్
- ●Special TET | ఇన్సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్.. పరీక్షలు ఎప్పుడంటే?
- ●Horoscope | ఆగస్టు 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మానసిక ఆందోళన ఎక్కువ!

Seed Ganesha | గణనాథుడిని పూజిద్దాం.. మొక్కలను నాటుదాం.. ప్రకృతిని కాపాడుదాం..

Driving Licence | మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్.. ఇకపై ఆ పాఠాలు వినాల్సిందే!

Road Accident | లారీని ఢీకొట్టిన మినీ బస్సు.. డ్రైవర్ సహా ఆరుగురు దుర్మరణం

Moosarambagh Bridge | ఎట్టకేలకు ముగిసిన ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్






