త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో జోష్‌.. భారీ లాభాల్లో సూచీలు..

Stock Markets | దేశీయ‌స్టాక్ మార్కెట్‌ల‌లో సోమవారం ఉదయం ట్రేడింగ్ సెషన్‌లో భారీ కొనుగోళ్లు నమోదయ్యాయి. కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 ఒక్కోటి 1 శాతానికి పైగా ఎగ‌బాకాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పెరిగి ఇంట్రాడేలో 76,335 స్థాయిని తాకగా, నిఫ్టీ 50 కూడా 1 శాతానికి పైగా లాభపడి 23,989 గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

S

Business | Published On May 25, 2026, 10.29 am IST

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో జోష్‌.. భారీ లాభాల్లో సూచీలు..
Advertisement

Stock Markets | దేశీయ‌స్టాక్ మార్కెట్‌ల‌లో సోమవారం ఉదయం ట్రేడింగ్ సెషన్‌లో భారీ కొనుగోళ్లు నమోదయ్యాయి. కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 ఒక్కోటి 1 శాతానికి పైగా ఎగ‌బాకాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పెరిగి ఇంట్రాడేలో 76,335 స్థాయిని తాకగా, నిఫ్టీ 50 కూడా 1 శాతానికి పైగా లాభపడి 23,989 గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్, బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ సూచీలు కూడా ఒక్కొక్కటి 1 శాతం చొప్పున పెరిగాయి. మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లోని రూ.463 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.468 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఇన్వెస్టర్లు సుమారు రూ.5 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై పెరిగిన ఆశావాదం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. గత వారం ట్రేడింగ్ రేంజ్‌లోనే కదిలిన మార్కెట్, ఈ వార్తలతో ఒక్కసారిగా ఊపందుకుంది.

శాంతి ఒప్పందం దిశ‌గా పురోగ‌తి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. ఈ ఒప్పందం కుదిరితే ప్రపంచ చమురు ఎగుమతుల్లో ఐదో వంతు జరిగే కీలక సముద్ర మార్గమైన స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మళ్లీ తెరుచుకుంటుందని తెలిపారు. అయితే తరువాత ట్రంప్ మరోసారి స్పందిస్తూ, ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ నౌకలపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఒప్పంద నిబంధనలు, టైమ్‌లైన్‌పై స్పష్టత లేకపోయినా, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టొచ్చనే అంచనాలతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ ధర సోమవారం ఉదయం 5 శాతానికి పైగా పడిపోయి బ్యారెల్‌కు 98 డాలర్లకు దిగువకు చేరింది. ఇది మార్కెట్‌ల‌కు భారీ ఊరటనిచ్చింది.

స్పష్ట‌త అవ‌స‌రం..

చమురు ధరలు తగ్గితే భారత్ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి తగ్గడంతోపాటు ద్రవ్యోల్బణ ప్రమాదాలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ నుంచి వడ్డీ రేట్ల కోతలకు అవకాశం పెరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజ‌య్ కుమార్ మాట్లాడుతూ ఈ వారం మార్కెట్లు పాజిటివ్ నోట్‌తో ప్రారంభమ‌య్యాయ‌ని, అమెరికా-ఇరాన్ ఒప్పందంపై అంచనాలతో క్రూడ్ ధరలు 5 డాలర్లు పడిపోయి 100 డాలర్లకు దిగువకు వచ్చాయ‌ని అన్నారు. అయితే మార్కెట్ ఇంకా స్పష్టత కోసం ఎదురుచూస్తోంద‌ని, ఈ ఒప్పందం నిజమై, క్రూడ్ ధరలు మరింత తగ్గితే మార్కెట్‌కు అది కీలక మలుపు అవుతుంద‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement