Stock Markets | చమురు ధరల ఊరటతో మార్కెట్లు జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
Stock Markets | దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు గురువారం ట్రేడింగ్ను భారీ లాభాలతో ప్రారంభించాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్లలో బలమైన రీబౌండ్, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో కొనసాగుతున్న బలహీనత మార్కెట్లకు ప్రధాన ఊతంగా నిలిచాయి.
Stock Markets | దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు గురువారం ట్రేడింగ్ను భారీ లాభాలతో ప్రారంభించాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్లలో బలమైన రీబౌండ్, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో కొనసాగుతున్న బలహీనత మార్కెట్లకు ప్రధాన ఊతంగా నిలిచాయి. ప్రారంభ ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 398.43 పాయింట్లు (0.52 శాతం) పెరిగి 77,321.07 వద్ద ట్రేడవగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 123.90 పాయింట్లు (0.52 శాతం) లాభపడి 24,129.75 వద్ద కొనసాగింది. అమెరికా-ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 71 డాలర్లకు దిగువకు పడిపోయింది. చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడంతోపాటు దేశ దిగుమతి వ్యయం కూడా తగ్గే అవకాశం ఉండటంతో ఇది భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల పరిణామంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
విస్తృత మార్కెట్లు సైతం..
విస్తృత మార్కెట్ కూడా లాభాల్లోనే కొనసాగింది. నిఫ్టీ 100 సూచీ 0.41 శాతం, నిఫ్టీ 200 సూచీ 0.38 శాతం, నిఫ్టీ 500 సూచీ 0.36 శాతం, నిఫ్టీ మిడ్క్యాప్ 50 సూచీ 0.34 శాతం, నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 0.24 శాతం, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీ 0.41 శాతం చొప్పున పెరిగాయి. మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా విక్స్ సూచీ 2.81 శాతం తగ్గింది. రంగాల వారీగా చూస్తే ఐటీ షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ ఐటీ సూచీ 3.37 శాతం ఎగిసింది. నిఫ్టీ మిడ్ స్మాల్ ఐటీ అండ్ టెలికాం 1.68 శాతం, నిఫ్టీ మెటల్ 0.80 శాతం, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.68 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.50 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.46 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 0.45 శాతం, నిఫ్టీ ఆటో 0.34 శాతం చొప్పున లాభపడ్డాయి. అలాగే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 0.34 శాతం, నిఫ్టీ హెల్త్కేర్ ఇండెక్స్ 0.20 శాతం, నిఫ్టీ ఫార్మా 0.18 శాతం, నిఫ్టీ 500 హెల్త్కేర్ 0.18 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్ బ్యాంక్ 0.18 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.11 శాతం, నిఫ్టీ మిడ్ స్మాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.08 శాతం పెరిగాయి. నిఫ్టీ మీడియా స్థిరంగా ఉండగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ మాత్రం 0.03 శాతం స్వల్పంగా తగ్గింది.
రుతుపవనాలపైనే ఆందోళన..
సెన్సెక్స్లో ఇన్ఫోసిస్ 4.44 శాతం ఎగిసి అత్యధిక లాభదాయక షేర్గా నిలిచింది. హెచ్సీఎల్ టెక్ 3.56 శాతం, టీసీఎస్ 2.82 శాతం, టెక్ మహీంద్రా 2.35 శాతం పెరిగి ఐటీ రంగ ర్యాలీకి నాయకత్వం వహించాయి. ఇటర్నల్ 1.72 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 1.09 శాతం, ఇండిగో 1.03 శాతం, టైటాన్ 1.02 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.85 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.78 శాతం, సన్ ఫార్మా 0.74 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.73 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఎన్టీపీసీ 0.85 శాతం, బీఈఎల్ 0.79, లార్సెన్ అండ్ టూబ్రో 0.77, పవర్ గ్రిడ్ 0.73, భారతీ ఎయిర్టెల్ 0.54, బజాజ్ ఫైనాన్స్ 0.45, మారుతి సుజుకి 0.26, ట్రెంట్ 0.12 శాతం తగ్గగా, ఐటీసీ స్వల్ప నష్టాల్లో ట్రేడైంది. మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, నైరుతి రుతుపవనాల పురోగతిపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు. వర్షపాతం లోటు ఎక్కువకాలం కొనసాగితే గ్రామీణ డిమాండ్, వ్యవసాయ ఉత్పత్తి, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటంతో రుతుపవనాల పరిస్థితి మార్కెట్లకు కీలక అంశంగా మారింది.
సంబంధిత వార్తలు

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మళ్లీ క్షీణించిన రూపాయి విలువ..
జులై 1, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లకు స్వల్ప ఊరట.. పెట్టుబడిదారుల్లో యుద్ధం టెన్షన్..
జులై 1, 2026

Stock Markets | వరుసగా రెండో సెషన్లోనూ స్టాక్ మార్కెట్లలో నష్టాలు.. తీవ్ర అస్థిరతతో సూచీలు..
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●WhatsApp | వాట్సాప్ యూజర్నేమ్ ఫీచర్కు భారీ సెక్యూరిటీ.. మోసాలకు చెక్ పెట్టేలా ఫీచర్లు..
- ●ACB Raids | డీఎస్పీ భీమ్రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఏకకాలంలో 20 చోట్ల దాడులు
- ●Merger Talks | కాంగ్రెస్లో విలీనం కానున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. తుది దశకు చర్చలు!
- ●India vs England | ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ఛాన్స్.. సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే..?
- ●Tollywood | గ్రాండ్గా డైరెక్టర్ మెహర్ రమేష్ కూతురి పెళ్లి - హాజరైన పవన్ కళ్యాణ్, చిరంజీవి
- ●22 ఏళ్ల తర్వాత నాకౌట్ విజయం

WhatsApp | వాట్సాప్ యూజర్నేమ్ ఫీచర్కు భారీ సెక్యూరిటీ.. మోసాలకు చెక్ పెట్టేలా ఫీచర్లు..

ACB Raids | డీఎస్పీ భీమ్రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఏకకాలంలో 20 చోట్ల దాడులు

Merger Talks | కాంగ్రెస్లో విలీనం కానున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. తుది దశకు చర్చలు!

India vs England | ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ఛాన్స్.. సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే..?



