త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | క్రూడ్‌ ధరల సెగ.. ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు..

Stock Markets | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగుతున్నాయి. మరోవైపు వచ్చే వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో అమెరికా ఆర్థిక గణాంకాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తుండటంతో గురువారం భారత ఈక్విటీ మార్కెట్లు పెద్దగా మార్పు లేకుండా ప్రారంభమయ్యాయి.

S

Business | Published On Sep 10, 2026, 9.52 am IST

Stock Markets | క్రూడ్‌ ధరల సెగ.. ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగుతున్నాయి. మరోవైపు వచ్చే వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో అమెరికా ఆర్థిక గణాంకాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తుండటంతో గురువారం భారత ఈక్విటీ మార్కెట్లు పెద్దగా మార్పు లేకుండా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 40.84 పాయింట్లు ( 0.05 శాతం) స్వల్ప లాభంతో 74,805.07 వద్ద ఉంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4.30 పాయింట్లు (0.02 శాతం) పెరిగి 23,435.80 వద్ద కొనసాగింది. గ‌త సెష‌న్‌లో మూడు నెలల కనిష్ఠ స్థాయిల వద్ద ముగిసిన రెండు ప్రధాన సూచీలు గురువారం ప్రారంభం మందకొడిగా సాగాయి. గత ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో ఏడు సెషన్లలో నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలను చవిచూశాయి. ఈ కాలంలో రెండు సూచీలు దాదాపు 3.1 శాతం చొప్పున పడిపోయాయి.

ఆందోళ‌న పెంచుతున్న చ‌మురు ధ‌ర‌లు..

మధ్యప్రాచ్యంలో సంఘర్షణ తీవ్రతరం కావడంతో ముడి చమురు ధరలు భారత మార్కెట్లకు ప్రధాన ఆందోళనగా మారాయి. సంఘర్షణ ప్రారంభమైన ఆరు నెలల తర్వాత జరిగిన అతిపెద్ద నౌకల దాడుల్లో భాగంగా అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ముంచివేసిన అనంతరం హోర్ముజ్ జలసంధి సమీపంలో 10 నౌకలపై దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్‌కు పెరిగిన క్రూడ్ ధరలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు ధరలు పెరగడం వల్ల దేశ దిగుమతి బిల్లు పెరగడంతోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికమయ్యే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక వృద్ధి, కంపెనీల లాభదాయకతపైనా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది.

Advertisement
Advertisement