Stock Markets | ఫ్లాట్గా ట్రేడవుతున్న సూచీలు.. మార్కెట్ల పయనమెటు..?
Stock Markets | అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందం నేపథ్యంలో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో మంగళవారం షేర్ మార్కెట్లు తమ ర్యాలీని కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 0.35 శాతం పెరిగి 76,529.74 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 50 సూచీ 0.28 శాతం ఎగిసి 23,922.15 వద్ద నిలిచింది.
Stock Markets | అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందం నేపథ్యంలో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో మంగళవారం షేర్ మార్కెట్లు తమ ర్యాలీని కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 0.35 శాతం పెరిగి 76,529.74 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 50 సూచీ 0.28 శాతం ఎగిసి 23,922.15 వద్ద నిలిచింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్లు సుమారు 3 శాతం లాభపడ్డాయి. మరోవైపు రూపాయి ప్రారంభ ట్రేడింగ్లో 4 పైసలు బలపడి, అమెరికన్ డాలర్తో పోలిస్తే 94.54 వద్ద నిలిచింది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ 23,939 వద్ద ట్రేడవుతుండగా, క్రితం సెషన్లో నిఫ్టీ 50 ముగింపు స్థాయి 23,853.90 కంటే ఎగువన మార్కెట్ ప్రారంభమవుతుందనే సంకేతాలు కనిపించాయి.
సందిగ్ధంలో మార్కెట్లు..
బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 83 డాలర్ల పరిధిలోనే కొనసాగాయి. ప్రాథమిక ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాకపోవడం, అలాగే ప్రపంచ ఇంధన సరఫరాల రవాణాకు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఎప్పుడు తిరిగి తెరుచుకుంటుందనే అంశంపై అనిశ్చితి కొనసాగడంతో, క్రూడ్ ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. అయితే అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శుక్రవారం స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందాలపై సంతకాలు జరిగే వరకు పెట్టుబడిదారులు ఆందోళనగానే ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకనే మార్కెట్లు సందిగ్ధంలో ఉన్నాయంటున్నారు. ఆ విషయంపై స్పష్టత వస్తే మార్కెట్లు మళ్లీ కోలుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
తాజావార్తలు
- ●8GB RAM | ప్రస్తుత ఏఐ యుగంలో 8జీబీ ర్యామ్ ఉన్న కంప్యూటర్లు సరిపోతాయా..?
- ●PM Modi | స్లోవేకియా అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ
- ●Miyazaki mango | అయోధ్య బాలరాముడికి నైవేద్యంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.. ఒక్కో పండు ధర రూ.లక్ష..!
- ●Fridge | సింగిల్ డోర్ ఉన్న ఫ్రిజ్ బెటరా.. డబుల్ డోర్ ఉన్నది తీసుకోవాలా..?
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. అనిశ్చితిలో మార్కెట్లు..
- ●NEET Re Examination | నీట్ రీ-ఎగ్జామ్.. జూన్ 22 వరకూ టెలిగ్రామ్ యాప్ బ్లాక్

8GB RAM | ప్రస్తుత ఏఐ యుగంలో 8జీబీ ర్యామ్ ఉన్న కంప్యూటర్లు సరిపోతాయా..?

PM Modi | స్లోవేకియా అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ

Miyazaki mango | అయోధ్య బాలరాముడికి నైవేద్యంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.. ఒక్కో పండు ధర రూ.లక్ష..!

Fridge | సింగిల్ డోర్ ఉన్న ఫ్రిజ్ బెటరా.. డబుల్ డోర్ ఉన్నది తీసుకోవాలా..?






