త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | న‌ష్టాల్లో ప్రారంభ‌మైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. స్వ‌ల్పంగా త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

Stock Markets | దేశీయ‌ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమ‌య్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) నిరంతర అమ్మకాలు, అంతర్జాతీయ అనిశ్చితులు, ఇతర ప్రతికూల అంశాల ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఒత్తిడిలోకి వెళ్లాయి. ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పడిపోయి 74,100 స్థాయి దిగువన ట్రేడ్ అయింది.

S

Business | Published On Jun 4, 2026, 10.13 am IST

Stock Markets | న‌ష్టాల్లో ప్రారంభ‌మైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. స్వ‌ల్పంగా త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..
Advertisement

Stock Markets | దేశీయ‌ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమ‌య్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) నిరంతర అమ్మకాలు, అంతర్జాతీయ అనిశ్చితులు, ఇతర ప్రతికూల అంశాల ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఒత్తిడిలోకి వెళ్లాయి. ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పడిపోయి 74,100 స్థాయి దిగువన ట్రేడ్ అయింది. మరోవైపు నిఫ్టీ 50 సూచీ 50 పాయింట్లకు పైగా క్షీణించి 23,350 స్థాయి కంటే దిగువన కొనసాగింది. మార్కెట్లలో భయాందోళనలను సూచించే ఇండియా విక్స్ 6 శాతం పెరిగి 16.28 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్, ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు అత్యధిక నష్టాలను నమోదు చేశాయి. ఇవి దాదాపు 1 శాతం వరకు పడిపోయాయి. అయితే ఏషియన్ పెయింట్స్ షేరు స్వల్ప లాభాలను నమోదు చేసింది.

స్వ‌ల్పంగా త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

విస్తృత మార్కెట్లు కూడా ఎరుపులోనే ప్రారంభమయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు దాదాపు 0.3 శాతం వరకు క్షీణించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించగా, నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 1 శాతం పడిపోయి అత్యధిక నష్టాలను చవిచూసింది. ఎన్‌ఎస్‌ఈలో సుమారు 1,242 షేర్లు నష్టాల్లో ఉండగా, 1,069 షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. 128 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ప్రారంభ ట్రేడింగ్‌లో 7 పైసలు బలపడి 95.69 వద్ద ట్రేడ్ అయింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.72 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 96 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.85 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 93 డాల‌ర్ల వ‌ద్ద ఉంది.

ప్ర‌తికూలంగానే..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపిన ప్రకారం ప్రస్తుతం మార్కెట్‌ల‌కు అనుకూల అంశాల కంటే ప్రతికూల అంశాల ప్రభావం ఎక్కువగా ఉంద‌న్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ ఆసియా సంక్షోభానికి పరిష్కారం దొరకకపోతే మార్కెట్లో బలమైన ర్యాలీకి అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పారు. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ మార్కెట్లు బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు భారత్ నుంచి మరింతగా నిధులను వెనక్కి తీసుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement