Stock Markets | స్టాక్ మార్కెట్లలో ర్యాలీ.. రూపాయి విలువ మళ్లీ పతనం..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు వరుస సెషన్లలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అంతకు ముందు మార్కెట్లలో తీవ్ర అస్థిరత ఏర్పడగా వరుసగా గురు, శుక్రవారాల్లో దూసుకెళ్తున్నాయి. శుక్రవారం సూచీలు పాజిటివ్గా ప్రారంభమై అదే ట్రెండ్ను కొనసాగిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 320 పాయింట్లు (0.42 శాతం) పెరిగి 75,700 వద్ద ఉండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 99 పాయింట్లు (0.36 శాతం) లాభపడి 23,788 వద్ద ఉంది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు వరుస సెషన్లలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అంతకు ముందు మార్కెట్లలో తీవ్ర అస్థిరత ఏర్పడగా వరుసగా గురు, శుక్రవారాల్లో దూసుకెళ్తున్నాయి. శుక్రవారం సూచీలు పాజిటివ్గా ప్రారంభమై అదే ట్రెండ్ను కొనసాగిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 320 పాయింట్లు (0.42 శాతం) పెరిగి 75,700 వద్ద ఉండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 99 పాయింట్లు (0.36 శాతం) లాభపడి 23,788 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న బలమైన సంకేతాల కారణంగా మార్కెట్లు ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అమెరికా, యూరోప్, ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అలాగే హెవీ వెయిట్ సెక్టార్లలో పెట్టుబడిదారులు భారీ ఎత్తున కొనుగోళ్లు చేపడుతున్నారు. ఇది కూడా మార్కెట్ల ర్యాలీకి కారణమైంది. ముఖ్యంగా లార్జ్ క్యాప్ బ్యాంకులు, ఐటీ, రిలయన్స్ తరహా భారీ పరిశ్రమల స్టాక్లు, ఆటో వంటి రంగాలకు చెందిన షేర్లకు డిమాండ్ ఏర్పడింది. చాలా రంగాల్లో పెట్టుబడిదారులు విలువ ఆధారిత స్టాక్స్ కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు విదేశీ ఇన్వెస్టర్లకు ఉపశమనం కలిగించేందుకు బాండ్ ఈల్డ్స్పై పన్ను మినహాయింపును కేంద్రం ప్రకటిస్తుందని సమాచారం అందుతోంది. ఇది కూడా మార్కెట్ సెంటిమెంట్ను పాజిటివ్గా ప్రభావితం చేసింది. అయితే పెట్టుబడిదారులు అంతర్జాతీయ పరిణామాల, భౌగోళిక ఉద్రిక్తతల పట్ల కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. అంతర్జాతీయంగా ఏర్పడే నెగెటివ్ పరిణామాలకు వేగంగా స్పందిస్తున్నారు. అందువల్ల కొత్తగా పెట్టుబడి లేదా ట్రేడింగ్ చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్వల్పంగా పెరిగిన చమురు ధరలు, పడిపోయిన రూపాయి విలువ..
ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఇంకా స్పష్టత రానందున చమురు ధరలు కాస్త పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.38 శాతం పెరిగి బ్యారెల్కు 107 డాలర్ల వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.57 శాతం పెరిగి బ్యారెల్కు 98 డాలర్ల వద్ద ఉంది. ఇక ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ శుక్రవారం కూడా పతనమైంది. అమెరికా డాలర్తో పోలిస్తే 15 పైసలు తగ్గిన రూపాయి 95.90 వద్ద ఆల్ టై గరిష్టానికి చేరువలో ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



