త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్లలో నీరసం.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం పెద్దగా ఉత్సాహం లేకుండా ముగిశాయి. టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి కొన్ని భారీ కంపెనీల షేర్లలో లాభాలు నమోదైనప్పటికీ, ఎస్‌బీఐ, రిలయన్స్ షేర్లలో వచ్చిన నష్టాలు వాటిని దాదాపుగా భర్తీ చేశాయి.

S

Business | Published On Aug 10, 2026, 4.01 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్లలో నీరసం.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం పెద్దగా ఉత్సాహం లేకుండా ముగిశాయి. టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి కొన్ని భారీ కంపెనీల షేర్లలో లాభాలు నమోదైనప్పటికీ, ఎస్‌బీఐ, రిలయన్స్ షేర్లలో వచ్చిన నష్టాలు వాటిని దాదాపుగా భర్తీ చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పెరిగిన ముడి చమురు ధరల కారణంగా మార్కెట్‌ల‌లో మదుపరుల సెంటిమెంట్ జాగ్రత్తగా కొనసాగింది. దీంతో వివిధ షేర్లు, రంగాల వారీగా భిన్నమైన కదలికలు కనిపించాయి. సెన్సెక్స్ 43 పాయింట్లు అత్యంత స్వ‌ల్పంగా (0.06 శాతం) పెరిగి 78,542 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 13 పాయింట్లు (0.05 శాతం) స్వల్పంగా లాభపడి 24,583.80 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.62 శాతం లాభపడగా, స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.27 శాతం నష్టపోయింది.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

కాగా ముడి చమురు ధరలు కూడా మార్కెట్‌ల‌పై ఒత్తిడిని పెంచాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.82 శాతానికి పైగా పెరిగి 86 డాల‌ర్ల‌కు చేరింది. డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.84 శాతం వ‌ర‌కు పెరిగి బ్యారెల్‌కు 78 డాల‌ర్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ మ‌రోమారు త‌గ్గింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 0.10 శాతం న‌ష్ట‌పోయిన రూపాయి 95.29 వ‌ద్ద నిలిచింది. మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. హోర్ముజ్ జ‌ల‌సంధిని తిరిగి తెర‌వాలంటే ఇరాన్ విధించిన అన్ని ష‌ర‌తుల‌ను అమెరికా అంగీక‌రించాల్సి ఉంటుంద‌ని తెలిసింది. ఇరాన్‌పై విధించిన ఆంక్ష‌ల‌ను ఎత్తివేయ‌డంతోపాటు యుద్ధం వ‌ల్ల జ‌రిగిన న‌ష్టానికి ప‌రిహారం అందించాల‌ని అప్పుడే జ‌ల‌సంధిని తెరుస్తామ‌ని అమెరికాకు ఇరాన్ స్ప‌ష్టంగా చెప్పిన‌ట్లు స‌మాచారం.

విస్తృత స్థాయి మార్కెట్ల‌కు మ‌ద్ద‌తు..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయ‌ర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఫ‌లితాలు విస్తృత స్థాయి మార్కెట్ల‌కు మ‌ద్ద‌తును ఇస్తున్నాయ‌ని తెలిపారు. అందువ‌ల్లే సూచీలు ప‌త‌న‌మ‌వ‌కుండా నిల‌బ‌డ్డాయ‌ని అన్నారు. అయితే యుద్ధ ఉద్రిక్త‌త‌లు పెర‌గ‌డం లేదా జ‌ల‌సంధి తెరుచుకోక‌పోతే మార్కెట్‌ల‌లో మ‌ళ్లీ బ‌ల‌హీన‌త క‌నిపించే అవ‌కాశాలు ఉంటాయ‌ని అన్నారు.

Advertisement
Advertisement