త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మూడో రోజూ దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ, ఫార్మా షేర్ల‌లో జోష్‌..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, ఐటీ, ఫార్మా, ఎంపిక చేసిన బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్‌కు బలమైన మద్దతు లభించింది. సెన్సెక్స్ 262 పాయింట్లు (0.34 శాతం) పెరిగి 77,763.91 వద్ద ముగిసింది.

S

Business | Published On Jul 3, 2026, 4.10 pm IST

Stock Markets | మూడో రోజూ దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ, ఫార్మా షేర్ల‌లో జోష్‌..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, ఐటీ, ఫార్మా, ఎంపిక చేసిన బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్‌కు బలమైన మద్దతు లభించింది. సెన్సెక్స్ 262 పాయింట్లు (0.34 శాతం) పెరిగి 77,763.91 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సూచీ 95 పాయింట్లు (0.39 శాతం) ఎగబాకి 24,270.85 వద్ద స్థిర‌ప‌డింది. అయితే మార్కెట్లు ఉద‌యం సెష‌న్‌లో భారీ లాభాలతో ప్రారంభం అయిన‌ప్ప‌టికీ త‌రువాత అమ్మ‌కాల ఒత్తిడి పెరిగింది. దీంతో ఉద‌యం వ‌చ్చిన లాభాల‌ను నిలుపులేక‌పోయాయి. ఇంట్రా డే క‌నిష్టాల వ‌ద్ద సూచీలు ముగిశాయి. అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాలు ప్రధాన సూచీలతో పోలిస్తే బలహీనంగా కనిపించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.19 శాతం తగ్గగా, స్మాల్‌క్యాప్ 100 సూచీ కేవలం 0.04 శాతం మాత్రమే స్వల్ప లాభాన్ని నమోదు చేసింది.

అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిణామాలు..

గత మూడు ట్రేడింగ్ సెషన్‌లలో సెన్సెక్స్ దాదాపు 1,300 పాయింట్లు (1.7 శాతం) పెరిగింది. ఇదే సమయంలో నిఫ్టీ 50 కూడా 400 పాయింట్లకు పైగా (1.7 శాతం) లాభపడింది. ఈ వారాన్ని పరిశీలిస్తే, సెన్సెక్స్, నిఫ్టీ రెండూ దాదాపు 1 శాతం చొప్పున పెరిగాయి. దీంతో వరుసగా నాలుగో వారాన్ని కూడా లాభాలతో ముగించినట్లైంది. శుక్ర‌వారం మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణంగా ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లు నిలిచాయి. ఈ షేర్ల‌లో భారీగా కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు గతంలో అంచనా వేసినంత తీవ్రంగా ఉండకపోవచ్చనే అంచనాలు కూడా మార్కెట్‌కు ఊతమిచ్చాయి. జూన్ నెలకు సంబంధించిన అమెరికా ఉద్యోగ గణాంకాలు కొంత బలహీనంగా రావడం, ఇటీవల గరిష్ఠ స్థాయిల నుంచి ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడం వల్ల ఈ ఏడాది ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై మార్కెట్ల‌ అంచనాలు మరింత త‌గ్గాయి.

చ‌మురు ధ‌ర‌లు పెరిగినా..

శుక్ర‌వారం సెష‌న్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు పెరిగిన‌ప్ప‌టికీ మార్కెట్ల సెంటిమెంట్ మాత్రం పాజిటివ్‌గానే క‌నిపించింది. వారాంతం కావ‌డంతో పెట్టుబ‌డిదారులు రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌క అమ్మ‌కాల‌కు దిగిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 71 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.75 శాతం పెరిగి బ్యారెల్‌కు 68 డాల‌ర్ల వ‌ద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ కాస్త బ‌ల‌ప‌డింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.2 వ‌ద్ద ఉన్న రూపాయి 18 పైస‌లు లాభ‌ప‌డింది.

వ‌చ్చే వారం కీల‌కం..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్ల నుంచి అనుకూల సంకేతాలు, అమెరికా ఉద్యోగ మార్కెట్ గణాంకాలు బలహీనంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా సడలింపు ధోరణి ఏర్పడుతుందనే అంచనాలు దేశీయ మార్కెట్‌ల‌కు మద్దతు ఇచ్చాయని తెలిపారు. అయితే వారాంతం కావ‌డంతో లాభాల స్వీకరణ, ఒడిదుడుకులు కనిపించినప్పటికీ మార్కెట్ చివరకు లాభాల్లోనే ముగిసిందని చెప్పారు. అలాగే భారత్-జపాన్ సదస్సు నుంచి వచ్చిన సానుకూల ఫలితాలు, ఐటీ రంగంలో కొనసాగుతున్న రికవరీ కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా ముడి చమురు ధరలు తగ్గడం కూడా మార్కెట్ల ర్యాలీకి కార‌ణ‌మైంద‌ని, అయితే వ‌చ్చే వారం కీల‌కంగా మారుతుంద‌ని అన్నారు.

Advertisement
Advertisement