Stock Markets | వరుసగా ఏడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో సెషన్లోనూ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరిగిన ముడి చమురు ధరలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. గతేడాది సెప్టెంబర్ తర్వాత నిఫ్టీ వరుసగా ఏడు సెషన్ల పాటు నష్టపోవడం ఇదే తొలిసారి. బుధవారం నిఫ్టీ 50 సూచీ 77 పాయింట్లు (0.32 శాతం) నష్టపోయి 24,078.30 వద్ద ముగిసింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో సెషన్లోనూ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరిగిన ముడి చమురు ధరలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. గతేడాది సెప్టెంబర్ తర్వాత నిఫ్టీ వరుసగా ఏడు సెషన్ల పాటు నష్టపోవడం ఇదే తొలిసారి. బుధవారం నిఫ్టీ 50 సూచీ 77 పాయింట్లు (0.32 శాతం) నష్టపోయి 24,078.30 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 326 పాయింట్లు (0.42 శాతం) క్షీణించి 76,909.68 వద్ద స్థిరపడింది.
భారీగా పెరిగిన చమురు ధరలు..
మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగాలు కూడా బెంచ్మార్క్ సూచీల బాటలోనే నష్టాలను నమోదు చేశాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 150 సూచీ 0.25 శాతం పడిపోగా, నిఫ్టీ స్మాల్క్యాప్ 250 సూచీ 0.63 శాతం క్షీణించింది. వరుసగా ఏడు సెషన్లలో నిఫ్టీ మొత్తం 2 శాతం నష్టపోయింది. మరోవైపు సెన్సెక్స్ వరుసగా నాలుగో సెషన్లో నష్టాలను చవిచూసింది. ఈ నాలుగు సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 1.5 శాతం పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరుగుతుండడం మార్కెట్ల పతనానికి కారణమైంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో వారిపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర ఈ ఒక్క సెషన్లోనే 0.49 శాతం మేర పెరిగి బ్యారెల్కు 90 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.58 శాతం మేర పెరిగి బ్యారెల్కు 85 డాలర్లకు చేరింది. ఫారెక్స్ మార్కెట్లో భారత రూపాయి మళ్లీ నిరాశాజనక ప్రదర్శన చేసింది. అమెరికా డాలర్తో పోలిస్తే 95.74 వద్ద ఉన్న రూపాయి ఈ సెషన్లో 0.08 శాతం మేర నష్టోయింది.
తాజావార్తలు
- ●Gade Innaiah gets bail | తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు బెయిల్.. మంజూరు చేసిన హైకోర్టు
- ●Sabitha Indra Reddy | 22A వెనుక ఆ 'మతలబు' ఏంటి? కమీషన్లు ఇస్తేనే క్లియరెన్సా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్
- ●Ayesha Khan | డైమండ్ రింగ్తో అయేషా ఖాన్.. ఎంగేజ్మెంట్ చేసుకుందా ఏంటీ..?
- ●Bengaluru Traffic | ఉదయం 10 అయినా ఆఫీసులో ఖాళీ కుర్చీలు దర్శనం.. స్టార్టప్ ఫౌండర్ పోస్ట్ వైరల్
- ●Sampath Kumar Padayatra | వరుణ దేవుడి కరుణ కోసం.. అలంపూర్లో సంపత్ కుమార్ మెగా పాదయాత్ర!
- ●Harish Rao | తెలంగాణ భవన్కు పోటెత్తిన 22A బాధితులు.. సమస్యలు విని బాధితులకు భరోసా ఇచ్చిన హరీశ్రావు

Gade Innaiah gets bail | తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు బెయిల్.. మంజూరు చేసిన హైకోర్టు

Sabitha Indra Reddy | 22A వెనుక ఆ 'మతలబు' ఏంటి? కమీషన్లు ఇస్తేనే క్లియరెన్సా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్

Ayesha Khan | డైమండ్ రింగ్తో అయేషా ఖాన్.. ఎంగేజ్మెంట్ చేసుకుందా ఏంటీ..?

Bengaluru Traffic | ఉదయం 10 అయినా ఆఫీసులో ఖాళీ కుర్చీలు దర్శనం.. స్టార్టప్ ఫౌండర్ పోస్ట్ వైరల్






