త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మార్కెట్లకు ఐటీ షేర్ల‌ షాక్.. సెన్సెక్స్ 281 పాయింట్లు డౌన్..

Stock Markets | భారత ఈక్విటీ మార్కెట్లు సోమ‌వారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 281 పాయింట్లు పడిపోయి 77,728 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 78 పాయింట్లు క్షీణించి 24,288 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) షేర్లలో అమ్మకాల ఒత్తిడి బెంచ్‌మార్క్ సూచీలను దెబ్బతీసింది.

S

Business | Published On Aug 17, 2026, 4.12 pm IST

Stock Markets | మార్కెట్లకు ఐటీ షేర్ల‌ షాక్.. సెన్సెక్స్ 281 పాయింట్లు డౌన్..
Advertisement

Stock Markets | భారత ఈక్విటీ మార్కెట్లు సోమ‌వారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 281 పాయింట్లు పడిపోయి 77,728 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 78 పాయింట్లు క్షీణించి 24,288 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) షేర్లలో అమ్మకాల ఒత్తిడి బెంచ్‌మార్క్ సూచీలను దెబ్బతీసింది. కార్పొరేట్ యాక్షన్ సెటిల్‌మెంట్ (సీఏఎస్) సర్దుబాట్ల తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ రెండూ చెరో 0.3 శాతం నష్టపోయాయి. అయితే విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్ సూచీలతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ బ్యాంక్ ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కోలుకుని 7 పాయింట్లు పెరిగి 57,498 వద్ద ముగిసింది. ఆర్థిక రంగ షేర్లలో కొనుగోళ్లు దీనికి మద్దతుగా నిలిచాయి. మిడ్‌క్యాప్ సూచీ 35 పాయింట్లు పెరిగి 63,817 వద్ద ముగిసినా, మొత్తం మార్కెట్‌లో మాత్రం నష్టపోయిన షేర్లే ఎక్కువగా ఉన్నాయి. సీఏఎస్ సర్దుబాట్ల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే సెన్సెక్స్ 116 పాయింట్లు, నిఫ్టీ 54 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 200 పాయింట్లకు పైగా దిగువకు సర్దుబాటు అయ్యాయి.

ఐటీ షేర్ల ప‌త‌నం..

నిఫ్టీలో ఐటీ షేర్లు ప్రధానంగా నష్టాలను మోశాయి. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన ఐదు షేర్లలో మూడు ఐటీ రంగానికి చెందినవే. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో లోహాల ధరలు పెరగడంతో మెటల్ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్ వంటి షేర్లు లాభాల్లో నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంట్రాడే కనిష్ఠాల నుంచి గణనీయంగా కోలుకుని దాదాపు 1 శాతం లాభంతో ముగిసింది. దీంతో నిఫ్టీకి సుమారు 20 పాయింట్ల మద్దతు లభించింది. మొదటి త్రైమాసిక ఫలితాల తర్వాత వోల్టాస్ షేరు 4 శాతం పడిపోయింది. అయితే మార్జిన్ రికవరీ మూడో త్రైమాసికం నుంచి కనిపించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. జెఫరీస్ సంస్థ షేరును డౌన్‌గ్రేడ్ చేయడంతో బీఎస్ఈ కూడా మిడ్‌క్యాప్ విభాగంలోని ప్రధాన నష్టాల్లో ఒకటిగా నిలిచింది.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు సోమ‌వారం మ‌ళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 0.43 శాతం మేర పెరిగి 87 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.66 శాతం పెరిగి బ్యారెల్‌కు 82 డాల‌ర్ల వద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ మళ్లీ ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.59 వ‌ద్ద ఉన్న రూపాయి సెష‌న్‌లో 18 పైస‌లు న‌ష్టపోయింది. కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (సీఈఆర్సీ) గడువులోగా పనులు పూర్తి చేయకపోయినా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు గ్రిడ్ కనెక్టివిటీని కొనసాగించేందుకు అనుమతించడంతో రెన్యూవబుల్ ఎనర్జీ షేర్లలో జోష్ కనిపించింది. ఇనాక్స్ విండ్ షేరు 6 శాతం లాభపడింది.

Advertisement

తాజావార్తలు

Advertisement