త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIP | రోజుకు కేవ‌లం రూ.150 పెట్టుబ‌డి పెడితే 15 ఏళ్లలో రూ.1 కోటి అవుతుంది.. అది ఎలాగో చూడండి..!

SIP | కోటి రూపాయల సంపాదన చాలా మంది లక్ష్యంగా ఉంటుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) మార్గాన్ని ఎంచుకుంటున్నారు. క్రమబద్ధమైన పెట్టుబడులు, దీర్ఘకాలిక దృష్టికోణం ఉంటే, కాంపౌండింగ్ ప‌వ‌ర్ ద్వారా చిన్న మొత్తాలే పెద్ద సంపదగా మారే అవకాశం ఉంటుంది.

S

Business | Published On Jan 24, 2026, 9.41 am IST

SIP | రోజుకు కేవ‌లం రూ.150 పెట్టుబ‌డి పెడితే 15 ఏళ్లలో రూ.1 కోటి అవుతుంది.. అది ఎలాగో చూడండి..!
Advertisement

SIP | కోటి రూపాయల సంపాదన చాలా మంది లక్ష్యంగా ఉంటుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) మార్గాన్ని ఎంచుకుంటున్నారు. క్రమబద్ధమైన పెట్టుబడులు, దీర్ఘకాలిక దృష్టికోణం ఉంటే, కాంపౌండింగ్ ప‌వ‌ర్ ద్వారా చిన్న మొత్తాలే పెద్ద సంపదగా మారే అవకాశం ఉంటుంది. ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్ట‌డం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. అలాగే మార్కెట్ ఎప్పుడు ఎగబాకుతుందో, ఎప్పుడు పడిపోతుందో అంచనా వేయాల్సిన అవసరం లేకుండా ఈక్విటీ మార్కెట్లలో భాగస్వామ్యం కావడానికి SIP ఒక సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాల వంటి దీర్ఘకాల వ్యవధిలో, అధిక రాబడులు ఇచ్చే ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే కోటి రూపాయల కార్పస్‌ను కూడగట్టే అవకాశం ఉందని గత అనుభవాలు సూచిస్తున్నాయి.

25 శాతం అంచ‌నా రాబ‌డి అయితే..

మ్యూచువల్ ఫండ్స్‌లో గతంలో కొన్ని పథకాలు సంవత్సరానికి సగటున 25 శాతం వరకు రాబడులు ఇచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు కేవలం రూ.150, అంటే నెలకు రూ.4,500 SIPగా పెట్టుబడి పెట్టినా, దీర్ఘకాలంలో భారీ మొత్తంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. 15 ఏళ్ల కాలపరిమితి, 25 శాతం అంచనా రాబడులతో లెక్కిస్తే మొత్తం పెట్టుబడి రూ.8.10 లక్షలు కాగా, దానిపై వచ్చే లాభం సుమారు రూ.79.91 లక్షలు ఉండొచ్చు. అలా మొత్తం విలువ దాదాపు రూ.88 లక్షలకు చేరవచ్చని అంచనా. ఈ లెక్కలు చూస్తే, అనుకూల మార్కెట్ పరిస్థితుల్లో దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక, క్రమశిక్షణ కలిగిన పెట్టుబడులు ఇన్వెస్టర్లకు గణనీయమైన ఫలితాలు అందించగలవని స్పష్టమవుతోంది. అయితే కొంతమంది ఇన్వెస్టర్లు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ బంగారాన్ని కూడా ఒక మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.

బంగారం కంటే ఎక్కువ ఆదాయం..

గత ఏడాది కాలంలో బంగారం ధరలు 50 శాతం కంటే ఎక్కువగా పెరిగి ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. గత 15 సంవత్సరాల్లో చూస్తే, 2010లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర సుమారు రూ.18,000 ఉండగా, 2025 నాటికి అది రూ.1.25 లక్షలకు చేరింది. అంటే సగటున సంవత్సరానికి 13.8 శాతం వృద్ధిరేటు (CAGR) నమోదైంది. అదే రోజుకు రూ.150 చొప్పున బంగారంలో పెట్టుబడి పెడితే, మొత్తం పెట్టుబడి రూ.8.10 లక్షలు కాగా, దానిపై వచ్చే లాభం సుమారు రూ.18.94 లక్షలు మాత్రమే ఉండొచ్చు. దీంతో మొత్తం విలువ దాదాపు రూ.27 లక్షల వరకే చేరుతుంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, రోజుకు చిన్న మొత్తంతో కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈక్విటీ ఆధారిత SIPలే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులు భద్రత, స్థిరత్వం ఇస్తాయి గానీ, వేగంగా సంపద పెరగాలంటే షేర్లు, ఈక్విటీ ఫండ్స్ మెరుగైన వృద్ధి సామర్థ్యం కలిగి ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే గత రాబడులు భవిష్యత్తులోనూ అలాగే ఉంటాయనే హామీ లేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ ప్రమాదాలు, ఆర్థిక పరిస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి, పెట్టుబడులు పెట్టే ముందు తప్పనిసరిగా ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, సరైన ప్రణాళికతో ముందుకు సాగితేనే ఆర్థిక భద్రత సాధ్యమవుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement