త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Overload | అధిక లోడ్‌తో వాహ‌నాల్లో ప్ర‌యాణిస్తే భారీ జ‌రిమానా.. కేంద్రం కొత్త నియ‌మాలు..

Overload | కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ (MoRTH) అధిక లోడ్‌తో ప్రయాణించే వాహనాలపై ఇక మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఈ మేర‌కు ఆ శాఖ మంగ‌ళ‌వారం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ కొత్త నియమాలు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. అధిక లోడ్‌పై జరిమానాలను సవరించ‌డంతోపాటు, మరింత తార్కికమైన విధానాన్ని ప్రవేశపెట్టింది.

S

Business | Published On Apr 14, 2026, 4.42 pm IST

Overload | అధిక లోడ్‌తో వాహ‌నాల్లో ప్ర‌యాణిస్తే భారీ జ‌రిమానా.. కేంద్రం కొత్త నియ‌మాలు..
Advertisement

Overload | కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ (MoRTH) అధిక లోడ్‌తో ప్రయాణించే వాహనాలపై ఇక మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఈ మేర‌కు ఆ శాఖ మంగ‌ళ‌వారం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ కొత్త నియమాలు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. అధిక లోడ్‌పై జరిమానాలను సవరించ‌డంతోపాటు, మరింత తార్కికమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే అద‌న‌పు లోడ్ మ‌రీ భారీగా ఉంటే మాత్రం కొర‌డా ఝులిపించ‌నున్నారు. నేషనల్ హైవేస్ ఫీజు (రేట్ల నిర్ణయం, వసూలు) నాల్గవ సవరణ నియమాలు, 2026లోని సవరించిన రూల్ 10 ప్రకారం, ఇకపై ఫ్లాట్ జరిమానా విధానానికి బదులుగా, అదనపు లోడ్ శాతంపై ఆధారపడి ఫీజులు వసూలు చేస్తారు.

40 శాతానికి మించితే 4 రెట్లు ఎక్కువ ఫీజు..

చిన్న స్థాయి బరువు తేడాలకు ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. వాహనం అనుమతించిన బరువుకంటే 10 శాతం వరకు అధిక లోడ్ తీసుకెళ్లినా ఎటువంటి జరిమానా విధించరు. అయితే 10 శాతం నుంచి 40 శాతం వరకు అధిక లోడ్ ఉన్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ వాహనాలు ప్రామాణిక టోల్ ఫీజుకు రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా 40 శాతానికి మించి అధిక లోడ్ ఉంటే 4 రెట్లు ఎక్కువ ఫీజు విధిస్తారు. ఇది భారీ ఉల్లంఘనల కింద‌కు వ‌స్తుంది. అలాంటి ఉల్లంఘ‌న‌ల‌కు మ‌ళ్లీ పాల్ప‌డకుండా ఉండేందుకు ఈ భారీ ఫీజు పనిచేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సవరించిన విధానం ద్వారా జాతీయ రహదారుల భద్రతను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల ప‌నితీరును పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే చిన్న స్థాయి లోడ్ వ్యత్యాసాలపై వాహనదారులకు అనవసర ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేశారు.

ఫాస్టాగ్, ఎల‌క్ట్రానిక్ ప‌ద్ధ‌తిలో వ‌సూలు..

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాల నుంచి ఓవర్‌లోడ్ ఛార్జీలను వసూలు చేయడానికి FASTag, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలను ఉపయోగించనున్నారు. చెల్లుబాటు అయ్యే FASTag లేకుండా హైవేపై ప్రవేశించే వాహనాలపై ప్రస్తుత నియమాల ప్రకారం చర్యలు తీసుకుంటారు. అమలు చర్యల‌ను పూర్తిగా ధ్రువీకరించిన Weigh-in-Motion (WIM) వ్యవస్థలు లేదా టోల్ ప్లాజాల వద్ద ఉన్న స్థిర తూకం యంత్రాల ద్వారా నిర్వ‌హిస్తారు. వాహనం మొత్తం బరువు (లోడ్, ఇంధనం, ప్రయాణికులు సహా)ను రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)లో పేర్కొన్న గ్రాస్ వెహికల్ వెయిట్ (GVW)తో పోల్చి నిర్ణయిస్తారు. టోల్ ప్లాజాలో తూకం సదుపాయం లేకపోతే, ఓవర్‌లోడ్ ఫీజు మినహాయించి, సాధారణ టోల్ మాత్రమే వసూలు చేస్తారు. దీర్ఘకాలికంగా నియమాలను అమలు చేయడానికి, పారదర్శకతను పెంచడానికి, అధిక లోడ్ ఉన్న అన్ని వాహనాల వివరాలను ఆటోమేటిక్‌గా VAHAN డేటాబేస్‌లో నమోదు చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement