Gold Loans | భారీ స్థాయిలో పెరుగుతున్న గోల్డ్ లోన్స్.. కారణాలు ఇవే..
Gold Loans | బంగారం ధరలు రోజు రోజుకీ పెరుగుతుండడంతో పెట్టుబడిదారులనే కాకుండా రుణగ్రహీతలను కూడా పసిడి ఆకర్షిస్తోంది. గత కొన్నేళ్లుగా బంగారం ఆధారంగా తీసుకునే సెక్యూర్డ్ రుణాలు (గోల్డ్ లోన్స్) భారీగా పెరిగాయని ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది.
Gold Loans | బంగారం ధరలు రోజు రోజుకీ పెరుగుతుండడంతో పెట్టుబడిదారులనే కాకుండా రుణగ్రహీతలను కూడా పసిడి ఆకర్షిస్తోంది. గత కొన్నేళ్లుగా బంగారం ఆధారంగా తీసుకునే సెక్యూర్డ్ రుణాలు (గోల్డ్ లోన్స్) భారీగా పెరిగాయని ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. బంగారంపై తీసుకునే రుణాల్లో ప్రతి ఏడాది 128 శాతం పెరుగుదల నమోదవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. వ్యక్తిగత రుణాలతో పోటీ పడుతూ గోల్డ్ లోన్స్ వృద్ధిని సాధిస్తున్నాయని తేలింది. జనవరి 31 నాటికి మొత్తం బ్యాంకు రుణాల్లో 14.4 శాతం వృద్ధి చోటు చేసుకుందని ఆర్బీఐ తెలియజేసింది.
వ్యక్తిగత రుణాలదే అధిక వాటా..
వ్యక్తిగత రుణాలు ఇతర అన్ని విభాగాల కన్నా ఎక్కువ వేగంగా పెరుగుతున్నాయని ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం బ్యాంకు రుణాల్లో పర్సనల్ లోన్స్ వాటా 34.5 శాతంగా ఉంది. ఇవి మూడవ వంతు భాగాన్ని ఆక్రమించాయి. తరువాతి స్థానంలో సేవల రంగం ఉంది. అందులోనూ ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఇచ్చే రుణాలే అత్యంత వేగంగా పెరుగుతున్నాయని గుర్తించారు. ఇక ఇండస్ట్రియల్ క్రెడిట్ మాత్రం భిన్న దృశ్యాన్ని సంతరించుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) రుణాలు వేగంగా మంజూరు అవుతున్నాయని, ఈ రుణాల సంఖ్య కూడా పెరిగిందని, కానీ కార్పొరేట్ సంస్థల రుణాల వృద్ధి మాత్రం మందగించిందని వివరించింది.
పెండింగ్ గోల్డ్ లోన్స్ @ రూ.4 లక్షల కోట్లు..
బంగారు ఆభరణాలపై ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న రుణాలు మొదటిసారిగా రూ.4 లక్షల కోట్ల మార్కును దాటినట్లు ఆర్బీఐ గణాంకాలు తెలియజేశాయి. జనవరి 31 వరకు ఇవి రూ.4,00,517 కోట్లకు చేరాయి. కొత్తగా పెరిగిన బ్యాంకు రుణాల్లో 9 శాతం వాటా గోల్డ్ లోన్స్దే కావడం విశేషం. జనవరి 26, 2024 నుంచి జనవరి 31, 2026 వరకు బంగారు ఆభరణాలపై పెండింగ్ రుణాలు సుమారు రూ.3.1 లక్షల కోట్లు పెరిగాయి. ఇది రెండు సంవత్సరాల్లో 338 శాతం వృద్ధిగా నమోదు అయింది. అంటే పోర్ట్ ఫోలియో నాలుగింతలకు పైగా విస్తరించినట్లు అర్థమవుతోంది. ఇక ఈ భారీ వృద్ధికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో బంగారం ధరలు 152 శాతం పెరగడం ఒక కారణం అయితే, బంగారాన్ని సెక్యూరిటీగా పెట్టుకుని ఇచ్చే రుణాలను తప్పనిసరిగా గోల్డ్ లోన్స్గా వర్గీకరించాలనే నియంత్రణ ఆదేశం మరొక కారణమని అంటున్నారు.
జనవరి 24, 2025తో పోలిస్తే జనవరి 31, 2026 నాటికి ఆహారేతర బ్యాంకు రుణాలు 14.4 శాతం పెరగగా, మార్చి 21, 2025 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రుణాల వృద్ధి 12 శాతంగా నమోదైంది. ఈ క్రమంలో ఆహారేతర రుణాల్లో రూ.21.8 లక్షల కోట్ల పెరుగుదల చోటు చేసుకున్నట్లు ఆర్బీఐ గణాంకాల ద్వారా తేలింది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న తీవ్ర అస్థిరత.. పెట్టుబడిదారులకు అలర్ట్..
జులై 15, 2026

RBI | ఇక బ్యాంకులు బలవంతంగా ఆర్థిక ఉత్పత్తులను విక్రయించడం కుదరదు.. ఆర్బీఐ కొత్త రూల్స్..
జులై 14, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
జులై 14, 2026
తాజావార్తలు
- ●Harish Rao vs Beerla Ilaiah | సర్పంచ్ కాకముందు నువ్వు ఏం చేసేవాడివో గుర్తుందా? బీర్ల ఐలయ్యకు వార్నింగ్
- ●MLC Dasoju Sravan | సీఎం రేవంత్ 18 గంటలు కష్టపడి ఐటీ పరిశ్రమను చంపేస్తున్నారు : ఎమ్మెల్సీ దాసోజు
- ●Zoho Classes 2.0 | జోహో క్లాసెస్ 2.0 వచ్చేసింది.. ఏఐతో బోధన, విద్యా నిర్వహణ ఇక మరింత సులువు..
- ●Mahabubnagar Journalists Boycott | మహబూబ్నగర్లో సీఎం రేవంత్ పర్యటనలో హైడ్రామా.. అధికారుల తీరుపై జర్నలిస్టుల మూకుమ్మడి బహిష్కరణ
- ●Cabinet Decisions | దేశీయ సెమీకండక్టర్ రంగానికి భారీ బూస్ట్.. రూ.1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0
- ●Pooja Hegde | ఆయన మనసులో ఏదీ దాచుకోడు.. సల్మాన్ ఖాన్పై పూజా హెగ్డే ప్రశంసలు

Harish Rao vs Beerla Ilaiah | సర్పంచ్ కాకముందు నువ్వు ఏం చేసేవాడివో గుర్తుందా? బీర్ల ఐలయ్యకు వార్నింగ్

MLC Dasoju Sravan | సీఎం రేవంత్ 18 గంటలు కష్టపడి ఐటీ పరిశ్రమను చంపేస్తున్నారు : ఎమ్మెల్సీ దాసోజు

Zoho Classes 2.0 | జోహో క్లాసెస్ 2.0 వచ్చేసింది.. ఏఐతో బోధన, విద్యా నిర్వహణ ఇక మరింత సులువు..

Mahabubnagar Journalists Boycott | మహబూబ్నగర్లో సీఎం రేవంత్ పర్యటనలో హైడ్రామా.. అధికారుల తీరుపై జర్నలిస్టుల మూకుమ్మడి బహిష్కరణ



