MLC Dasoju Sravan | సీఎం రేవంత్ 18 గంటలు కష్టపడి ఐటీ పరిశ్రమను చంపేస్తున్నారు : ఎమ్మెల్సీ దాసోజు
MLC Dasoju Sravan | ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమ కుదేలవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడి ఐటీ రంగాన్ని చంపేస్తున్నారని ఆయన విమర్శించారు.
MLC Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమ కుదేలవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడి ఐటీ రంగాన్ని చంపేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ అనగానే ఒకప్పుడు చార్మినార్ గుర్తొచ్చేది. ఇప్పుడు ఐటీ, ఫార్మా పరిశ్రమలకు హైదరాబాద్ పేరు గాంచింది. వేగంగా పురోగమిస్తున్న నగరాలలో హైదరాబాద్ ఒకటిగా ఉన్న పరిస్థితి నుంచి రేవంత్ పాలనలో దిగజారే దాకా వెళ్తోంది. 2014లో రూ. 50 వేల కోట్ల ఉన్న ఐటీ ఎగుమతులను 2023లో రూ. 2 లక్షల కోట్లు దాటేలా కేటీఆర్ శ్రమించారు. 3 లక్షల ఐటీ ఉద్యోగాల స్థాయి నుంచి కేటీఆర్ 9 లక్షల ఐటీ ఉద్యోగాల స్థాయికి హైదరాబాద్ను మార్చారు. కానీ ఇప్పుడు అందరూ సిగ్గుపడేలా పరిస్థితి మారింది అని శ్రవణ్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్కు కాగ్నిజెంట్ రాంరాం
రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడి ఐటీ పరిశ్రమను చంపేసే పని చేస్తున్నారు. హైదరాబాద్కు కాగ్నిజెంట్ రాంరాం అన్నది. 15 నుంచి 200 వేల ఉద్యోగాలు కల్పించే కాగ్నిజెంట్ విశాఖకు తరలుతోంది. కాగ్నిజెంట్ను రెండు చోట్ల విస్తరించేలా గతంలో రెండు ఎంవోయూలు కుదిరాయి. అయినా కాగ్నిజెంట్ హైదరాబాద్ నుంచి విశాఖకు మారుతోంది. లోకేష్ దగ్గర ఉన్న మంత్ర దండం ఏమిటీ? రేవంత్ దగ్గర లేనిదేమిటీ? హైదరాబాద్లో లేనిది విశాఖలో ఏముంది? కేటీఆర్ హయంలో ఐటీ పరిశ్రమ వృద్ధి చెందింది.. రేవంత్ హయంలో దిగజారుతోంది ఎట్లా..? అని నిలదీశారు.
కుడితోలో పడ్డ ఎలుకలా మంత్రి శ్రీధర్ బాబు పరిస్థితి
ఏడు వేల ఐటీ ఉద్యోగాలు తగ్గాయని భట్టి అసెంబ్లీలోనే చెప్పారు. రేవంత్ రెడ్డి ఉద్యోగాలను మింగేస్తున్నారు. కేటీఆర్ సగటున 60 వేల ఉద్యోగాలు పెంచితే రేవంత్ రెడ్డి ఆరు వేల ఉద్యోగాలు తగ్గిస్తున్నాడు. ఇప్పటికే లక్షా 20 వేల ఉద్యోగాలు కోల్పోయాం. మంత్రి శ్రీధర్ బాబు పరిస్థితి కుడితోలో పడ్డ ఎలుకలా తయారైంది. మాట్లాడితే మంత్రి పదవి పోతుంది అనే భయం. తెలంగాణ రైసింగ్ కాదు.. రేవంత్ రెడ్డి ఆయన ఫ్యామిలీ రైజింగ్. రియల్ ఎస్టేట్ దందాలతో రేవంత్ సంపాదించుకుంటున్నారు.. మరి ఐటీ మీద ఆధార పడుతున్న వారి పరిస్థితి ఏమిటీ..? అని ప్రశ్నించారు.
దుర్గం చెరువు మరో జవహర్ నగర్ డంప్ యార్డ్
దావోస్ పోయి పెద్దపెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం ప్రకటించాలి. దుర్గం చెరువు దగ్గర నిర్మాణ వ్యర్థాల కుప్ప పెద్దది అవుతోంది.. మరో జవహర్ నగర్ డంప్ యార్డ్ తయారవుతోంది. కేటీఆర్ హయంలో టీఎస్ ఐపాస్తో 18 లక్షలకు పైగా ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయని తెలిపారు.
కాళేశ్వరం నీళ్లు ఆంధ్రాకే.. ఐటీ పరిశ్రమలు ఆంధ్రకేనా ?
కాళేశ్వరం నీళ్లు ఆంధ్రాకే.. ఐటీ పరిశ్రమలు ఆంధ్రకేనా ? రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంయా? ఆంధ్రాకు సీఎంయా ?లేక ఏపీ సీఎం చప్రాసా? జాబ్ కేలండర్ ఏమైంది? నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే గొడ్లను బాదినట్టు బాదుతున్నారు. హిట్లర్ పాలనతో పెట్టుబడులు వస్తాయా? సీఎం రక్తం, బూతు భాషలతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? కాళేశ్వరంతో నీళ్లు ఇయ్యమంటే రక్తం కావాలంటాడు. గోదావరి జలాల ఎత్తితే కేసీఆర్కు పేరు వస్తుందని రేవంత్ భయపడుతున్నాడు. రైతులు ట్యాంకర్లతో తమ పొలాలను పండించుకునే దుస్థితికి రేవంత్ తెలంగాణను మార్చాడు. కేసీఆర్ తెలంగాణ ఖ్యాతిని పెంచితే రేవంత్ తుంచుతున్నాడు. తెలంగాణ భవిష్యత్ను రేవంత్ ఫణంగా పెడితే చరిత్ర క్షమించదు అని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sterlite Technologies | ఏడాదిలో ఏకంగా 641 శాతం రాబడి.. ఇన్వెస్టర్లపై కాసులు కురిపిస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీ షేర్..
- ●GV Prasad | నారాయణపేట డీఎఫ్వో అరుదైన ఘనత
- ●TG Assembly | ధరణితో భూముల ‘బందీ’.. కేసీఆర్ పాలనపై పొంగులేటి తీవ్ర ఆరోపణలు
- ●Dasoju Sravan | ఆ ఎకరం స్థలాన్ని వెంటనే అప్పగించాలి : దాసోజు శ్రవణ్ డిమాండ్
- ●Adarsha Kutumbam | ఫ్యామిలీ మ్యాన్ .. యాక్షన్ బాట పడితే - ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చేసింది - రిలీజ్ డేట్పై క్లారిటీ
- ●Minister Ponguleti | కేసీఆర్ మాస్టర్ స్కెచ్ ధరణి

Sterlite Technologies | ఏడాదిలో ఏకంగా 641 శాతం రాబడి.. ఇన్వెస్టర్లపై కాసులు కురిపిస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీ షేర్..

GV Prasad | నారాయణపేట డీఎఫ్వో అరుదైన ఘనత

TG Assembly | ధరణితో భూముల ‘బందీ’.. కేసీఆర్ పాలనపై పొంగులేటి తీవ్ర ఆరోపణలు

Dasoju Sravan | ఆ ఎకరం స్థలాన్ని వెంటనే అప్పగించాలి : దాసోజు శ్రవణ్ డిమాండ్





