త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nirmala Sitharaman | ‘డెవలప్డ్‌ ఇండియా’ కోసం బ్యాంకింగ్‌ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ

Nirmala Sitharaman | భారత బ్యాంకింగ్‌ రంగాన్ని భవిష్యత్‌ సవాళ్లకు సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ‘బ్యాంకింగ్‌ ఫర్‌ ఎ డెవలప్డ్‌ ఇండియా’ పేరుతో త్వరలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం వెల్లడించారు.

P

Business | Published On Aug 17, 2026, 4.22 pm IST

Nirmala Sitharaman | ‘డెవలప్డ్‌ ఇండియా’ కోసం బ్యాంకింగ్‌ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ
Advertisement

Nirmala Sitharaman | భారత బ్యాంకింగ్‌ రంగాన్ని భవిష్యత్‌ సవాళ్లకు సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ‘బ్యాంకింగ్‌ ఫర్‌ ఎ డెవలప్డ్‌ ఇండియా’ పేరుతో త్వరలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) సమావేశంలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ తదుపరి దశ వృద్ధికి అనుగుణంగా బ్యాంకింగ్‌ రంగాన్ని తీర్చిదిద్దడమే కమిటీ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. బ్యాంకింగ్‌ రంగంపై సమగ్ర సమీక్ష నిర్వహించి.. అవసరమైన సంస్కరణలు, భవిష్యత్‌ కార్యాచరణపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుందని చెప్పారు.

ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యం

బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటంతో పాటు ఆర్థిక సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయడం కమిటీ ప్రధాన అంశాల్లో ఒకటిగా ఉంటుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. భారత ఆర్థికాభివృద్ధిలో బ్యాంకింగ్‌ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. రానున్న కాలంలో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించి వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది.

బడ్జెట్‌లోనే ప్రతిపాదన

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనే బ్యాంకింగ్‌ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటును నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. బ్యాంకింగ్‌ రంగాన్ని సమగ్రంగా సమీక్షించి, దేశ తదుపరి వృద్ధి దశకు అనుగుణంగా వ్యవస్థను మార్చే దిశగా కమిటీ సూచనలు చేయనుందని అప్పట్లో పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వంతో పాటు ఆర్థిక సమ్మిళితత్వం, వినియోగదారుల రక్షణను కాపాడుతూ బ్యాంకింగ్‌ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే కమిటీ లక్ష్యంగా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement