త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI | క్రెడిట్ కార్డు బిల్లును యూపీఐతో కడుతున్నారా? ఎండీఆర్‌పై కీలక క్లారిటీ

UPI | చాలా మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు యూపీఐ ద్వారా తమ క్రెడిట్ కార్డు బిల్లులను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా చెల్లిస్తున్నారు. అయితే ప్రతిపాదిత మర్చంట్ డిస్కౌంట్ రేట్, అంటే ఎండీఆర్, అమల్లోకి వస్తే ఈ చెల్లింపులపై వ్యాపారులు లేదా వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.

S

Business | Published On Sep 18, 2026, 12.13 pm IST

UPI | క్రెడిట్ కార్డు బిల్లును యూపీఐతో కడుతున్నారా? ఎండీఆర్‌పై కీలక క్లారిటీ
Advertisement

UPI | చాలా మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు యూపీఐ ద్వారా తమ క్రెడిట్ కార్డు బిల్లులను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా చెల్లిస్తున్నారు. అయితే ప్రతిపాదిత మర్చంట్ డిస్కౌంట్ రేట్, అంటే ఎండీఆర్, అమల్లోకి వస్తే ఈ చెల్లింపులపై వ్యాపారులు లేదా వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఆర్థిక సలహాదారులు తెలిపిన ప్రకారం యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే వినియోగదారులపై ప్రస్తుతం ఎలాంటి ఛార్జీ విధించడం లేదు. అయితే కొత్తగా ఎండీఆర్ విధానం అమల్లోకి వస్తే వినియోగదారులు యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించే సమయంలో ఖర్చు మారుతుందా అనేది ప్రధాన అంశంగా మారింది.

ఛార్జీల‌ను చెల్లించాలా..

లాయల్టీ రివార్డ్జ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అమ్రేష్ ఆచార్య మాట్లాడుతూ యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డును ఉపయోగించే వినియోగదారులకు ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. ఇప్పటివరకు వినియోగదారులపై ఎలాంటి ఛార్జీ విధించలేదని, ఇకపై కూడా అదే విధానం కొనసాగుతుందని చెప్పారు. పాయింట్ల కోసం, క్రెడిట్ ఫ్లోట్ కోసం లేదా ఇతర కారణాలతో ఎవరైనా క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవడం వారి వ్యక్తిగత ఎంపిక అని, యూపీఐ ఎండీఆర్ విధానం దీనిపై ఎలాంటి ప్రభావం చూపదని వివరించారు. విభ్వంగల్ అనుకూలరా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మౌర్య కూడా క్రెడిట్ కార్డు బిల్లులను యూపీఐ ద్వారా చెల్లించే వినియోగదారులపై ఎలాంటి సాధారణ ఎండీఆర్ విధించలేదని తెలిపారు. ఎన్‌పీసీఐ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులను యూపీఐ పరిధిలోకి తీసుకొచ్చినప్పటికీ, వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన ఎండీఆర్‌ను అది నిర్ణయించదని చెప్పారు.

చెల్లింపులు ఎలా అవుతాయి..

సాధారణ బ్యాంకు నుంచి బ్యాంకుకు జరిగే యూపీఐ లావాదేవీలకు సాధారణంగా వినియోగదారులపై ఎలాంటి ఎండీఆర్ ఛార్జీలు ఉండవు. అయితే క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, అంటే బీబీపీఎస్ ద్వారా ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థలో పాల్గొనే సంస్థలు తమ మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాల ప్రకారం కొన్ని ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. అంటే యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం సాధారణ బ్యాంకు-టు-బ్యాంకు యూపీఐ బదిలీకి పూర్తిగా సమానం కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ చెల్లింపు బీబీపీఎస్ వ్యవస్థ ద్వారా వెళ్తుంది. ఈ వ్యవస్థ వినియోగదారులు ఉపయోగించే ప్లాట్‌ఫామ్‌ను సంబంధిత బిల్లర్‌తో అనుసంధానించి, చెల్లింపు సెటిల్‌మెంట్‌ను పూర్తి చేస్తుంది.

బీబీపీఎస్ వ్యవస్థలో పాల్గొనే సంస్థలు తమ వాణిజ్య నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేసే అవకాశం ఉందని సిద్ధార్థ్ మౌర్య తెలిపారు. క్రెడిట్ కార్డు బిల్లును బీబీపీఎస్ ద్వారా చెల్లించడం ఎన్‌పీసీఐ నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయ్యే విధానమేనని చెప్పారు. అయితే కొన్ని సందర్భాల్లో కన్వీనియన్స్ ఫీజు లేదా ప్రాసెసింగ్ ఛార్జీ ఉంటుంద‌ని, కానీ దానిని యూపీఐ ఎండీఆర్‌గా పరిగణించరాదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement