త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | శ్రీ‌వారి ముడుపు ప‌త్రం.. కొత్త ప‌థ‌కానికి ఆమోదం తెలిపిన టీటీడీ బోర్డు..!

TTD | తిరుమల తిరుపతి దేవస్థానం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్‌కు మంజూరు ఇచ్చినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అన్నమయ్య భవనంలో ఈవో ఎం రవిచంద్రతో కలిసి నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలను వివ‌రించారు.

P

Andhra pradesh | Published On Feb 28, 2026, 8.10 pm IST

TTD | శ్రీ‌వారి ముడుపు ప‌త్రం.. కొత్త ప‌థ‌కానికి ఆమోదం తెలిపిన టీటీడీ బోర్డు..!
Advertisement

TTD | తిరుమల తిరుపతి దేవస్థానం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్‌కు మంజూరు ఇచ్చినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అన్నమయ్య భవనంలో ఈవో ఎం రవిచంద్రతో కలిసి నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలను వివ‌రించారు.

నిర్ణ‌యాలు..

  • టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన వసతుల కోసం రూ.118.89 కోట్లు కేటాయింపు. డిజిటల్ క్లాస్‌రూములు, అదనపు హాస్టళ్లు, వంటగదుల ఆధునికీక‌ర‌ణ‌కు ఆమోదం.
  • భక్తుల సౌలభ్యం కోసం “శ్రీవారి ముడుపు పత్రం పథకం”ను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు నిర్ణయం. యూపీఐ చెల్లింపుల ద్వారా ముడుపు పత్రాలు అందించి హుండీలో సమర్పించే విధానం అమలు.
  • తిరుమలలో అదనంగా అన్నప్రసాద భవనం, ఆధునిక వంటశాల నిర్మాణానికి రిలయన్స్ సంస్థ రూ.100–120 కోట్ల విరాళంతో పనులకు గ్రీన్ సిగ్నల్.
  • శ్రీ‌వాణి ట్రస్ట్ మార్గదర్శకాల్లో మార్పులకు ఆమోదం.
  • ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం కోసం రూ.20.17 కోట్లతో డ్రై ఐలాండ్ నిర్మాణానికి అనుమతి.
  • కోయంబత్తూర్, గువహటి, బెలగావి, పాట్నా సమీప మోకామాలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి కేటాయించిన భూములను స్వీకరించేందుకు ఆమోదం.
  • వకుళమాత ఆలయంలో “అక్షర గోవిందం” కార్యక్రమం ప్రారంభానికి నిర్ణయం.
  • ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ఏప్రిల్ 1న సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తులకు అదనంగా రూ.50 విలువైన లడ్డూ ప్రసాదం ఉచితంగా అందించనున్నారు.
  • బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.4.25 కోట్లతో విద్యుత్ అలంకరణలు, ఎల్ఈడి బోర్డులు ఏర్పాటు.
  • భద్రత బలోపేతానికి తిరుమల, తిరుపతిలో 727 మంది సిబ్బంది నియామకానికి ఆమోదం. అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు.
  • గోశాలలు, ఇంక్యూబేషన్ సెంటర్ అభివృద్ధికి రూ.11.28 కోట్లు.
  • 51 మంది పరిచారకులకు అర్చకులుగా పదోన్నతి అంశాన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు నిర్ణయం.
  • పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీ వేంకటేశ్వర దివ్య క్షేత్ర నిర్మాణానికి రూ.14.25 కోట్లు.
  • టీటీడీ ఆలయాలు, వసతి సముదాయాల భద్రత పర్యవేక్షణకు తిరుపతిలో రూ.10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు.
Advertisement
Advertisement