త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana rice production 2023-24 | వరి సాగులో తెలంగాణ ‘విశ్వరూపం’: దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా రికార్డు

2023-24 వ్యవసాయ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. 168.75 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది.

J

Agriculture | Published On Jan 16, 2026, 10.00 pm IST

Telangana rice production 2023-24 | వరి సాగులో తెలంగాణ ‘విశ్వరూపం’: దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా రికార్డు

సంక్షిప్త సారాంశం

2023-24 సంవత్సరంలో తెలంగాణ 168.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది. అలాగే పత్తి ఉత్పత్తిలో రాష్ట్రం మూడో స్థానాన్ని దక్కించుకుంది.

Advertisement

Telangana rice production 2023-24 | వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తుది అంచనాల ప్రకారం, వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. 2022-23 కాలానికి రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం, 2023-24 లో రికార్డు స్థాయి దిగుబడితో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

రికార్డు స్థాయి దిగుబడి

2023-24 కాలానికి గాను తెలంగాణలో మొత్తం 168.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి నమోదైంది. దేశవ్యాప్తంగా మొత్తం వరి ఉత్పత్తిలో తెలంగాణ వాటా దాదాపు 12.5% కావడం విశేషం.

టాప్ 5 రాష్ట్రాల వివరాలు (లక్షల మెట్రిక్ టన్నుల్లో):

తెలంగాణ: 168.75

ఉత్తరప్రదేశ్: 159.90

పశ్చిమ బెంగాల్: 156.87

పంజాబ్: 143.56

ఛత్తీస్‌గఢ్: 97.03

సీజన్ల వారీగా ఉత్పత్తి

రాష్ట్రంలో పండిన మొత్తం వరిలో ఖరీఫ్ సీజన్ వాటా 93.44 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, రబీ సీజన్‌లో 75.3 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఆ ఏడాది రైతులు మొత్తం 46.85 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. హెక్టారుకు సగటు దిగుబడి 36.02 క్వింటాళ్లుగా నమోదైంది.

పత్తి ఉత్పత్తిలోనూ టాప్

వరితో పాటు పత్తి ఉత్పత్తిలోనూ తెలంగాణ తన సత్తా చాటింది. 50.8 లక్షల బేల్స్ పత్తి ఉత్పత్తితో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. అయితే, గత ఏడాదితో (57.45 లక్షల బేల్స్) పోలిస్తే పత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తి కొంత మేర తగ్గాయి.

మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ 202.76 లక్షల మెట్రిక్ టన్నులతో దేశంలో ఆరో స్థానంలో నిలిచి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

దేశవ్యాప్తంగా మొత్తం ఉత్పత్తి

2023-24 సంవత్సరానికి గాను భారతదేశం మొత్తం మీద 1,376.97 లక్షల టన్నుల వరి ఉత్పత్తిని సాధించింది. తెలంగాణ 168.8 లక్షల టన్నులతో అగ్రస్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్ (159.9), పశ్చిమ బెంగాల్ (156.9) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ: 168.8 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్: 73.4 లక్షల టన్నులు, తమిళనాడు: 68 లక్షల టన్నులు, కర్ణాటక: 31.3 లక్షల టన్నులు, కేరళ: 0.56 లక్షల టన్నులు ఉత్పత్తి చేశాయి.

తక్కువ ఉత్పత్తి ఉన్న ప్రాంతాలు

లడఖ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో వరి ఉత్పత్తి సున్నాగా నమోదైంది.

ఈశాన్య రాష్ట్రాల వాటా

అస్సాం 55.4 లక్షల టన్నులతో ఈ ప్రాంతంలోనే అత్యధిక ఉత్పత్తి సాధించిన రాష్ట్రంగా నిలిచింది.

2024-25 వ్యవసాయ సంవత్సరానికి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ, వివిధ నివేదికల తాజా గణాంకాల ప్రకారం, వరి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానానికి చేరుకుంది. 2023-24 ఏడాది నంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణ, 2024-25 లో స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచింది.

చారిత్రక విజయం

2024-25లో భారతదేశం మొత్తం వరి ఉత్పత్తి 1,501.84 లక్షల టన్నుల రికార్డు స్థాయికి చేరుకుంది. దీనితో చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించింది.

ఉత్తరప్రదేశ్ పెరుగుదల

2023-24 లొ 159.9 లక్షల టన్నుల ఉత్పత్తితో ఉన్న యూపీ, 2024-25 లో ఏకంగా 30.9 శాతం వృద్ధిని నమోదు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 209.31 లక్షల టన్నులతో 2024-25 లో యూపీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

తెలంగాణ స్థిరత్వం

తెలంగాణలో కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల వల్ల దిగుబడి స్థిరంగా కొనసాగుతోంది. 2022-23 తో పోల్చితే 2023-24 లో రాష్ట్ర ఉత్పత్తిలో 1.3 శాతం వృద్ధి నమోదైంది.

మొత్తం ఉత్పత్తిలో యూపీ టాప్ లో ఉన్నప్పటికీ, హెక్టారుకు వచ్చే సగటు దిగుబడిలో పంజాబ్ (4,428 కేజీలు), ఆంధ్రప్రదేశ్ (3,928 కేజీలు) మొదటి స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement