త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sustainable agriculture | వ్యర్థాల నుంచి సుస్థిర వ్యవసాయానికి దారి చూపిన 11వ తరగతి విద్యార్థి

మానవ మూత్రం, బూడిద, వరి గడ్డితో పూర్తిగా సేంద్రీయ ఎరువు తయారు చేసిన 11వ తరగతి విద్యార్థి ఆలమ్ వీర్ జిందాల్. పంట దిగుబడి పెంపు, కాలుష్య నియంత్రణ, తక్కువ ఖర్చుతో సుస్థిర వ్యవసాయానికి మార్గం చూపిన ఈ బాలుడి ఆవిష్కరణకు జాతీయ స్థాయి ప్రశంసలు దక్కాయి.

a

Agriculture | Published On Dec 19, 2025, 12.40 pm IST

Sustainable agriculture | వ్యర్థాల నుంచి సుస్థిర వ్యవసాయానికి దారి చూపిన 11వ తరగతి విద్యార్థి
Advertisement

Class 11 Student Turns Waste into eco-friendly Fertilizer with Sustainable Farming Innovation

(త్రినేత్ర వ్యవసాయం డెస్క్)

Sustainable agriculture | భారత వ్యవసాయం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పెరుగుతున్న ఖర్చులు, మట్టిలో పోషకాల తగ్గుదల, కాలుష్యం పాత్రలే ఎక్కువ. వీటన్నింటికీ ఒకే పరిష్కారం చూపించేలా 11వ తరగతి విద్యార్థి ఆలమ్ వీర్ జిందాల్ చేసిన వైవిధ్యభరితమైన ఆవిష్కరణ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా వ్యర్థాలుగా భావించే మానవ మూత్రం, కట్టెలు లేదా మొక్కల బూడిద, వరి గడ్డి వంటి పదార్థాలతో ఆయన రూపొందించిన “ఈకో-ఫ్రెండ్లీ యూరిన్ వుడ్ యాష్ ఫర్టిలైజర్(Eco-Friendly Urine-ash Fertilizer)” పూర్తిగా సేంద్రీయ ఎరువుగా మారింది. ఈ ఎరువు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వంటి కీలక పోషకాలతో సమృద్ధిగా ఉండటమే కాకుండా సహజ పురుగుమందులా కూడా పనిచేస్తోంది. పంట దిగుబడిని మూడు నుంచి నాలుగు రెట్లు పెంచడమే కాకుండా, మొక్కల్లోకి క్యాన్సర్‌కు కారణమయ్యే ఆర్సెనిక్ శోషణను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని పరీక్షల్లో తేలింది. అంతేకాదు, నీటి వినియోగాన్ని తగ్గించి గాలి-నీరు-మట్టి కాలుష్యాన్ని నియంత్రించడంలో కూడా ఇది కీలకంగా సహాయపడుతోంది. తక్కువ ఖర్చుతో, ఎక్కడైనా తయారు చేసుకునే వీలుండటంతో రైతులకు ఇది ఎంతో అందుబాటులో ఉండే పరిష్కారంగా మారుతోంది.

సీడ్పీ-బ్యాగ్స్తో రోడ్లపక్కన స్వయంగా పెరిగే మొక్కలు

ఇదే ఆలోచనను మరింత విస్తరించిన ఆలమ్ వీర్, “సెల్ఫ్-గ్రోయింగ్ సీడ్ పీ-బ్యాగ్స్(Self-Growing Seed Pee-Bags,)” అనే వినూత్న పద్ధతిని కూడా అభివృద్ధి చేశాడు. ఈ విధానంలో నాటిన మొక్కలకు తరచూ నీరు పోయాల్సిన అవసరం లేకుండా, అదనపు ఎరువులు వాడకుండానే దీర్ఘకాలం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోడ్లపక్కన, పాడుబడిన ప్రదేశాల్లో హరితావరణం పెంచడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఈ ఆవిష్కరణల ద్వారా భారత్ విదేశాల నుంచి ఎరువులు, పురుగుమందులు దిగుమతి చేసుకోవడంపై ఖర్చు చేస్తున్న వేల కోట్ల రూపాయలను ఆదా చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆలమ్ వీర్ జిండాల్ చేసిన ఈ అసాధారణ కృషికి చండీగఢ్‌లోని ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) ప్రాంగణంలో నిర్వహించిన రాజ్యస్థాయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శనలో జాతీయ గుర్తింపు లభించింది. 116 పాఠశాలల నుంచి వచ్చిన 556 నమూనాల మధ్య “సుస్థిర వ్యవసాయం” థీమ్‌లో మొదటి బహుమతి సాధించడం ద్వారా, యువత ఆలోచనలు దేశ భవిష్యత్తును ఎలా మార్చగలవో ఆ అబ్బాయి  నిరూపించాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement