త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | సిద్దిపేట‌లో ఆక్ర‌మించుకున్న భూముల్లో పేద‌ల‌కు ఇళ్లు నిర్మిస్తాం

Ponguleti Srinivas Reddy | సిద్దిపేటలో అక్రమంగా కబ్జాకు గురైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని, వాటిలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

S

Telangana | Published On Sep 18, 2026, 4.25 pm IST

Ponguleti Srinivas Reddy | సిద్దిపేట‌లో ఆక్ర‌మించుకున్న భూముల్లో పేద‌ల‌కు ఇళ్లు నిర్మిస్తాం
Advertisement
  • మీడియా చిట్‌చాట్‌లో రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సిద్దిపేటలో అక్రమంగా కబ్జాకు గురైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని, వాటిలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ కొడుకు పేరు మీద ఉన్న 40 ఎక‌రాల భూమి ఎలా వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియా చిట్ చాట్ సంద‌ర్భంగా మాట్లాడారు.

సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో సుమారు 327 ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు తన పరపతిని ఉపయోగించి తన బంధువుల పేరిట 6 ఎకరాల అసైన్డ్ భూమిని కొనుగోలు చేశారు. రంగనాయక సాగర్ వద్ద, ఇతర ప్రాంతాల్లో వందల కోట్ల విలువైన భూములను అక్రమంగా దక్కించుకున్నారు. హ‌రీశ్ రావు ఇరిగేష‌న్ మంత్రిగా ఉన్న‌ప్పుడు రంగ‌నాయ‌క సాగ‌ర్ ద‌గ్గ‌ర భూ దోపిడీ చేశారు. ప్ర‌భుత్వం ఎక‌రాకు ఆరు ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తుంటే రూ.రెండు ల‌క్ష‌ల‌కు ఎక‌రం చొప్పున భూమి ఎలా కొన్నాడు? ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ల్యాండ్‌ను డిలీట్ చేయించి 13 ఎక‌రాల‌ను రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారు. ప్ర‌భుత్వ సొమ్ముతో హ‌రీశ్ రావు త‌న ఫామ్‌హౌస్‌ను అభివృద్ధి చేసుకున్నారు.

కేటీఆర్ కొడుక్కి 40 ఎక‌రాల భూమి ఎక్క‌డిది?

నూనూగు మీసాల కేటీఆర్ కొడుకుకి 40 ఎక‌రాల భూమి ఎలా వ‌చ్చింది? అసైన్డ్ భూముల పట్టాదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టం. కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర భూములపై సర్వే అనంతరం వాస్తవాలు వెల్లడిస్తాం. రంగనాయకసాగర్ భూముల వ్యవహారంపైనా రికార్డుల ఆధారంగా విచారణ జ‌రిపిస్తాం. తప్పు ఎవరు చేసినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. అధికారుల పొరపాట్లకు కూడా మినహాయింపు లేదు. కేటీఆర్ చెప్పిన‌ట్లుగా కేసీఆర్‌కు చిన్న‌ప్పుడే 2 ఎక‌రాల్లో ఇల్లుంటే ఎందుకు 2004 అఫిడ‌విట్‌లో చేర్చ‌లేదు? అని మంత్రి పొంగులేటి ప్ర‌శ్నించారు.

Advertisement
Advertisement