Uttam Kumar Reddy | కేసీఆర్ పాదయాత్ర చేస్తా అంటే జనాలు నవ్వుతున్నారు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy | త్వరలో పాదయాత్ర చేస్తానంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రకటించడాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శలు చేశారు. కేసీఆర్ పాదయాత్ర చేస్తానంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు.
Uttam Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: త్వరలో పాదయాత్ర చేస్తానంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రకటించడాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శలు చేశారు. కేసీఆర్ పాదయాత్ర చేస్తానంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) కూలిపోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా పాదయాత్ర చేస్తానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే ఇంజినీర్ను అని కాళేశ్వరం కట్టి కూల్చేశారని మండిపడ్డారు. ఇరిగేషన్ విషయంలో ఆయన చేసిన తప్పిదాల వల్లే రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. కేసీఆర్ బీజేపీకి (BJP) సరెండర్ అయ్యారని ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయినప్పుడు ఇక చర్యలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయొద్దని ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు.
ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయాని.. ఒకటి కేసీఆర్ అయితే.. మరొకటి ఎల్నినో అని వ్యాఖ్యానించారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ పనితీరు సున్నా అని విమర్శించారు. నీళ్ల పంపకాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. అన్నీ తనకే తెలిసినట్లు కేసీఆర్ మాట్లాడుతారని, అయితే పనితీరు మాత్రం సున్నా అని విమర్శించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు నీళ్లు లేవని చెప్పారు. ఎండాకాలం తాగునీటి అవసరాల దృష్ట్యా నీటిని చాలా పొదుపుగా వాడుతున్నామని తెలిపారు. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ ఫాం హౌస్లోనే ఉంటేనే మంచిదన్నారు. నీళ్లు ఉండికూడా తాము ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు లక్ష కోట్లు ఖర్చు చేశారని, ప్రాజెక్టును సరిగ్గా నిర్మించి ఉంటే ప్రస్తుత సమస్యలు వచ్చేవి కాదని చెప్పారు. తుమ్మిడిహెట్టి నుంచి నీటిని తరలించే విషయంలో మార్పులు చేయడం ఘోర తప్పిదమన్నారు. ఆ మార్పులు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేదని తెలిపారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. అసెంబ్లీలో కేసీఆర్ బూతులు మాట్లాడినప్పుడు హీరోలాగా ఫీల్ అయ్యారని, అదే భాషను ఆయనపై ఉపయోగిస్తే మాత్రం నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు. ఆయన వాడిన భాష తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ వాడలేదని విమర్శించారు. తెలంగాణ భాష ఇలా అవ్వడానికి కేసీఆర్ కారణమని చెప్పారు.
సంబంధిత వార్తలు

Talasani Srinivas Yadav | ప్రతిపక్షాల అరెస్టు అప్రజాస్వామికం.. రాహుల్ ఎన్నోసార్లు నల్లటీషర్టుతో పార్లమెంట్కు వెళ్లారు : తలసాని
సెప్టెంబర్ 7, 2026

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
సెప్టెంబర్ 6, 2026

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
సెప్టెంబర్ 6, 2026
తాజావార్తలు
- ●NSE | ఎన్ఎస్ఈ ప్రీ-ఓపెన్ సెషన్లో కీలక మార్పులు.. నేటి నుంచే కొత్త నిబంధనలు..
- ●CM Vijay | మహిళలను కించపరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు.. ఉదయనిధి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
- ●Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిని నిశితంగా గమనిస్తున్న ప్రజలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం..?
- ●BRS | అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
- ●BRS | అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు

NSE | ఎన్ఎస్ఈ ప్రీ-ఓపెన్ సెషన్లో కీలక మార్పులు.. నేటి నుంచే కొత్త నిబంధనలు..

CM Vijay | మహిళలను కించపరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు.. ఉదయనిధి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిని నిశితంగా గమనిస్తున్న ప్రజలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం..?



