త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | దేశంలో ఉండాలంటే.. అంద‌రూ వందేమాత‌రం ఆల‌పించాల్సిందే : బండి సంజ‌య్

Bandi Sanjay | దేశంలో ఉండాలంటే అంద‌రూ వందేమాత‌రం ఆల‌పించాల్సిందేన‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Mar 19, 2026, 4.38 pm IST

Bandi Sanjay | దేశంలో ఉండాలంటే.. అంద‌రూ వందేమాత‌రం ఆల‌పించాల్సిందే : బండి సంజ‌య్
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్ : దేశంలో ఉండాలంటే అంద‌రూ వందేమాత‌రం ఆల‌పించాల్సిందేన‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో వందేమాత‌రం ఆలాపాన సంద‌ర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు స‌భ నుంచి వెళ్లిపోవ‌డం స‌రికాదు అని ఆయ‌న మండిప‌డ్డారు. క‌రీంన‌గ‌ర్‌లో గురువారం మీడియాతో బండి సంజ‌య్ మాట్లాడారు.

వందేమాతరం ఆలపిస్తుండగా ఎంఐఎం సభ్యులు వెళ్లిపోయారు. కేంద్రం ఆదేశాలను ఎంఐఎం ఎమ్మెల్యేలు ధిక్కరించారు. ఎంఐఎం ఎమ్మెల్యేల తీరు తప్పని కూడా స్పీకర్ చెప్పలేని పరిస్థితి. ఎంఐఎం ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి. దేశంలో ఉండాలంటే అందరూ వందేమాతరం ఆలపించాల్సిందే. అసదుద్దీన్‌ ఒవైసీ నడిపే కళాశాలల్లో ఉగ్రమూలాలు ఉన్నాయని బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే అని స్పష్టం చేస్తూ.. ఒకవేళ తాము అధికారంలో ఉండి ఉంటే ఎంఐఎం నేతల మెడలు వంచి వందేమాతరం పాడించేవాళ్లమని, అప్పటికీ వినకపోతే కటకటాల వెనక్కి నెట్టేవాళ్లం. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ పార్టీకి తలొగ్గి, వారి మోచేతి నీళ్లు తాగుతోంది. దేశ సమగ్రత కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని బండి సంజ‌య్ నిలదీశారు.

ఇదే క్రమంలో స్పీకర్ నిర్ణయాలపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీ బీ-ఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తికి ‘క్లీన్ చిట్’ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని, పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ వైఖరి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చట్టసభల పవిత్రతను కాపాడటంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement