Rajagopal Reddy | నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారు.. బయటివారి పెత్తనం ఎక్కువైంది
Rajagopal Reddy | నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారని.. బయట నుండి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోసం కొట్లాడి ప్రత్యేక తెలంగాణను తెచ్చుకున్నామన్నారు.
- నేనెక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించలేదు.. విమర్శించను కూడా
- సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చేతుల్లో ఉంచి పార్టీ నడపొద్దు
- మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
Rajagopal Reddy | త్రినేత్ర.న్యూస్: నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారని.. బయట నుండి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోసం కొట్లాడి ప్రత్యేక తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం నడపవద్దని కోరారు. చౌటుప్పల్ లోని సీతారామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన శుక్రవారం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నిన్న చేసిన వ్యాఖ్యలపై మరోసారి మీడియాకు క్లారిటీ ఇచ్చిచారు.
ప్రజా పాలన అంటే పేదల కోసం పని చేయాలి. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, సీమాంధ్ర నాయకుల కోసం కాదు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్తోనే సాధ్యం. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. నేనెక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించలేదు.. విమర్శించను కూడా. బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే చెప్పా. నిజమైన కాంగ్రెస్ నాయకులను అణిచివేస్తున్నారనే విషయం గుర్తు చేశా.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో భాగంగా ఉద్యమకారులకు గుర్తింపు ఉండాలి. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్ తోనే సాధ్యం అని రాజగోపాల్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao | తెలంగాణ వ్యతిరేక అంశాలను ఎజెండా నుంచి తొలగించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్కు హాజరైతే చూస్తూ ఊరుకోం
ఆగస్టు 14, 2026

Fruit and vegetables | పండ్లు, కూరగాయల్లో అధిక పురుగుల మందులు.. తెలంగాణనే టాప్
ఆగస్టు 14, 2026

Harish Rao | రేవంత్ రెడ్డి.. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హరీశ్ రావు
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు
- ●Harish Rao | తెలంగాణ వ్యతిరేక అంశాలను ఎజెండా నుంచి తొలగించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్కు హాజరైతే చూస్తూ ఊరుకోం
- ●RRB Recruitment | 3993 పోస్టులతో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్.. దరఖాస్తులు షురూ..
- ●Traffic Restrictions | మరికాసేపట్లో నెక్లెస్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●JP Nadda | కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్కు తరలింపు
- ●Ponnam Prabhakar | ఐదు జిల్లాలు.. 85 పుష్కర ఘాట్లు.. 88 కోట్లు.. ఇదే గోదావరి పుష్కరాల కార్యాచరణ

Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు

Harish Rao | తెలంగాణ వ్యతిరేక అంశాలను ఎజెండా నుంచి తొలగించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్కు హాజరైతే చూస్తూ ఊరుకోం

RRB Recruitment | 3993 పోస్టులతో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్.. దరఖాస్తులు షురూ..

Traffic Restrictions | మరికాసేపట్లో నెక్లెస్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు



