త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | ఇది మ‌హిళ‌ల‌ను అవ‌మానించ‌డ‌మే : టీఆర్ఎస్ చీఫ్ క‌విత‌

Kavitha | తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు వేసిన కమిటీలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడం అంటే ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసిన సమస్త మహిళలను అవమానించడమే అని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత మండిప‌డ్డారు.

S

Telangana | Published On May 16, 2026, 3.30 pm IST

Kavitha | ఇది మ‌హిళ‌ల‌ను అవ‌మానించ‌డ‌మే : టీఆర్ఎస్ చీఫ్ క‌విత‌
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు వేసిన కమిటీలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడం అంటే ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసిన సమస్త మహిళలను అవమానించడమే అని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత మండిప‌డ్డారు. తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన భూ పోరాటాలు, ఉద్యమాలకు దిగివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీని ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు.

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, అమరవీరుల కుటుంబాలకు సమరయోధుల పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమిటీలతో కాలయాపన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రక్రియ ఈ ఏడాది జూన్ 2వ తేదీన ప్రారంభం కాకుంటే ఉద్యమకారులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నామ‌ని క‌ల్వ‌కుంట్ల కవిత పేర్కొన్నారు.

Advertisement
Advertisement