త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rangareddy | ఇస్తాం చెరువులో ఈత‌కెళ్లి ముగ్గురు యువ‌కులు మృతి

Rangareddy | మండుటెండ‌ల‌కు సేద తీరుదామ‌ని ఈత‌కు వెళ్లిన ఓ ముగ్గురు యువ‌కులు మృతి చెందారు. ఈ విషాద ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 

S

Telangana | Published On Mar 16, 2026, 3.19 pm IST

Rangareddy | ఇస్తాం చెరువులో ఈత‌కెళ్లి ముగ్గురు యువ‌కులు మృతి
Advertisement

Rangareddy | త్రినేత్ర‌.న్యూస్ : మండుటెండ‌ల‌కు సేద తీరుదామ‌ని ఈత‌కు వెళ్లిన ఓ ముగ్గురు యువ‌కులు మృతి చెందారు. ఈ విషాద ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గండిపేట మండల ప‌రిధిలోని ఇస్తాం చెరువులోకి ఓ ముగ్గురు యువ‌కులు సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఈత‌కు వెళ్లారు. చెరువులో ఈత కొడుతున్న క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు ఆ ముగ్గురు కూడా మునిగిపోయారు. ముగ్గురి మృత‌దేహాలు నీటిపై తేలియాడాయి. గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను చెరువులో నుంచి వెలికితీశారు. మృతుల‌ను ఇబ్రహీంబాగ్‌కు చెందిన కార్తీక్‌ (25), గోవర్ధన్‌ (23), వెంకటేశ్‌ (25)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement