Thalasani Srinivas Yadav | ప్రజాపాలన కాదిది.. సిగ్గులేని ప్రభుత్వం: తలసాని శ్రీనివాస్ యాదవ్
Thalasani Srinivas Yadav | ముమ్మాటికీ ఇది ప్రజాపాలన కాదని.. పేదలు, బాధితులు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పట్టించుకోని సిగ్గులేని ప్రభుత్వమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైరయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చరిత్ర ఉన్నంతకాలం ఉంటారని కొనియాడారు.
- ప్రజలు శాపనర్థాలు పెట్టినా కాంగ్రెస్ నాయకులు మారరు
- బూతులే సీఎం రేవంత్ ఏకైక మార్గం
- కేసీఆర్ అప్పులు చేసి అభివృద్ధి చేసిండు
- మరి మీరేం చేశారో చెప్పండి?
- కాంగ్రెస్ సర్కార్పై తలసాని శ్రీనివాస్యాదవ్ ఫైర్
Thalasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్: ముమ్మాటికీ ఇది ప్రజాపాలన కాదని.. పేదలు, బాధితులు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పట్టించుకోని సిగ్గులేని ప్రభుత్వమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైరయ్యారు. హైడ్రా ను తీసుకొచ్చి వేలాది ఇండ్లను కూల్చారని మండిపడ్డారు. బూతు మాటలే సీఎం రేవంత్రెడ్డి ఏకైక మార్గం అని ఎద్దేవా చేశారు. LB నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చరిత్ర ఉన్నంతకాలం ఉంటారని కొనియాడారు.
జూన్ 1 నుంచి సభ్యత్వ నమోదు..
జూన్ 1 నుండి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మహిళలకు రాజకీయ అవకాశాలు మరిన్ని పెరుగుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాలలో ప్రజలకు చేసిందేమీ లేదు. పేగులు తీసుకొని మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోళీలు ఆడుతా అని సీఎం రేవంత్ అంటాడు. దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు ఎంతో అనుకువగా ఉండాలి అని హితవు పలికారు.
ప్రజల మన్ననలను పొందితేనే నాయకులుగా ఎదుగుతారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి, సుపరిపాలనతో నాయకులు, కార్యకర్తల గౌరవం పెరిగింది. రైతు బంధు కింద ఏడాదికి ఎకరానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్.
ఏం చేయకుండానే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయకుండానే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. కేసీఆర్ అప్పులు చేశారని పదే పదే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు నోరు పారేసుకుంటున్నారు. కేసీఆర్ అద్భుతమైన సెక్రెటరీయేట్ నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించారు. మరి అప్పులు చేసి మీరేం చేశారో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు చెప్పాలి? బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తుంది అని తలసాని విమర్శించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



