త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Liver | లివ‌ర్లు మాయం చేస్తున్నారు సార్.. ఎంపీడీవోకు విద్యార్థుల ఫిర్యాదు

Liver | సార్ లివ‌ర్లు మాయం చేస్తున్నారంటూ ఓ ఎస్సీ బాలుర వ‌స‌తి గృహం విద్యార్థులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్థానికంగా చ‌ర్చానీయాంశ‌మైంది.

S

Telangana | Published On Feb 5, 2026, 9.02 am IST

Liver | లివ‌ర్లు మాయం చేస్తున్నారు సార్.. ఎంపీడీవోకు విద్యార్థుల ఫిర్యాదు
Advertisement

Liver | సార్ లివ‌ర్లు మాయం చేస్తున్నారంటూ ఓ ఎస్సీ బాలుర వ‌స‌తి గృహం విద్యార్థులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్థానికంగా చ‌ర్చానీయాంశ‌మైంది.

అస‌లేం జ‌రిగిందంటే..?

మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి ఎస్సీ బాలుర వ‌స‌తి గృహం అది. హాస్ట‌ల్ విద్యార్థుల‌కు వారానికో సారి చికెన్ క‌ర్రీతో కూడిన భోజ‌నం వ‌డ్డిస్తారు. అయితే ఆ చికెన్ క‌ర్రీలో ఒక్క లివ‌ర్ కూడా లేదు. లివ‌ర్ల‌ను ఇష్టంగా తినే కొంత మంది విద్యార్థుల‌కు.. హాస్టల్ సిబ్బంది నిర్వాకం తీవ్ర నిరాశ‌ను మిగిల్చింది. లివ‌ర్లు ఎక్క‌డ మాయం అవుతున్నాయ‌ని ఆ విద్యార్థుల‌కు సందేహం క‌లిగింది. దీనిపై హాస్ట‌ల్ వార్డెన్‌తో పాటు వంట మ‌న‌షుల‌ను నిల‌దీయ‌గా స‌మాధానం దాట‌వేశారు.

చేసేదేమీ లేక ఎంపీడీవో ఫిర్యాదు..

వారానికోసారి వ‌డ్డించే చికెన్ క‌ర్రీలో లివ‌ర్ ముక్క‌లు వేయ‌కుండా మాయం చేస్తున్నారు సార్ అంటూ స్థానిక ఎంపీడీవో బండారు పార్థ‌సార‌థికి బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు. తమకు చికెన్‌లో లివర్‌ ముక్కలు వేయకుండా మాయం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హాస్టల్‌కు సంబంధించిన పలువురు విద్యార్థులు ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చారు. మెనూ ప్రకారం సమయానికి భోజనం పెట్టించాలని అందులో పేర్కోన్నారు. దీంతో ఈ వింతైన ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement