త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajya Sabha | తెలంగాణ‌లో రెండు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ..!

Rajya Sabha | రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ బుధ‌వారం షెడ్యూల్‌ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 10 రాష్ట్రాలకు చెందిన 37 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఈ 37 మందిలో తెలంగాణ నుంచి ఇద్ద‌రు ఉన్నారు.

S

Telangana | Published On Feb 18, 2026, 2.33 pm IST

Rajya Sabha | తెలంగాణ‌లో రెండు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ..!
Advertisement

Rajya Sabha | త్రినేత్ర‌.న్యూస్ : రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ బుధ‌వారం షెడ్యూల్‌ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 10 రాష్ట్రాలకు చెందిన 37 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఈ 37 మందిలో తెలంగాణ నుంచి ఇద్ద‌రు ఉన్నారు. బీఆర్ఎస్ త‌ర‌పున కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ త‌ర‌పున అభిషేక్ మ‌ను సింఘ్వీ రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వీరిద్ద‌రి ప‌ద‌వీ కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియ‌నుంది. కేఆర్ సురేశ్ రెడ్డి ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడిగా కొన‌సాగుతున్నారు. ఇక కేశ‌వ‌రావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేర‌డంతో.. ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీకి కూడా రాజీనామా చేశారు. దీంతో ఆయ‌న స్థానంలో అభిషేక్ మ‌ను సింఘ్వీని రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేశారు.

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఈనెల 26న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 5న నామినేష‌న్ల‌కు చివ‌రి తేదీ. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, 9వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. మార్చి 16న పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.

Advertisement
Advertisement