త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLAs Disqualification | ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో స్పీక‌ర్‌కు సుప్రీం నోటీసులు

MLAs Disqualification | బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి అధికార పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త (MLAs Disqualification) కేసులో శాస‌న‌స‌భ స్పీక‌ర్ (Speaker) గ‌డ్డం ప్ర‌సాద్‌ (Gaddam Prasad)కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్క‌ర‌ణానికి పాల్ప‌డ్డార‌ని ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి వేసిన పిటిష‌న్‌ను విచారించిన ధ‌ర్మాస‌నం నోటీసులు ఇస్తూ విచార‌ణ‌ను వ‌చ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

A

Telangana | Published On Jan 19, 2026, 3.34 pm IST

MLAs Disqualification | ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో స్పీక‌ర్‌కు సుప్రీం నోటీసులు
Advertisement

MLAs Disqualification | త్రినేత్ర‌.న్యూస్‌ : బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి అధికార పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త (MLAs Disqualification) కేసులో శాస‌న‌స‌భ స్పీక‌ర్ (Speaker) గ‌డ్డం ప్ర‌సాద్‌ (Gaddam Prasad)కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో స్పీక‌ర్ కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డ్డాడ‌ని బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి అత్యున్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన న్యాయ‌స్థానం స్పీక‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో గ‌తంలో కేటీఆర్ వేసిన పిటిష‌న్‌తో మ‌హేశ్వ‌ర్‌రెడ్డి పిటిష‌న్‌ను కూడా జ‌త చేయాల‌ని సూచించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement