త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E Challans | పెండింగ్ చ‌లాన్ల కోసం బ‌ల‌వంతం చేయొద్దు.. ట్రాఫిక్ పోలీసుల‌కు హైకోర్టు ఆదేశం

E Challans | రాష్ట్రంలోని వాహ‌న‌దారుల‌ను ఊర‌ట క‌లిగించే విధంగా హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చ‌లాన్ల విష‌యంలో వాహ‌న‌దారుల‌ను బ‌ల‌వంతం పెట్టొద్ద‌ని ట్రాఫిక్ పోలీసుల‌ను కోర్టు ఆదేశించింది.

S

Telangana | Published On Jan 20, 2026, 5.26 pm IST

E Challans | పెండింగ్ చ‌లాన్ల కోసం బ‌ల‌వంతం చేయొద్దు.. ట్రాఫిక్ పోలీసుల‌కు హైకోర్టు ఆదేశం
Advertisement

E Challans | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని వాహ‌న‌దారుల‌ను ఊర‌ట క‌లిగించే విధంగా హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చ‌లాన్ల విష‌యంలో వాహ‌న‌దారుల‌ను బ‌ల‌వంతం పెట్టొద్ద‌ని ట్రాఫిక్ పోలీసుల‌ను కోర్టు ఆదేశించింది. రోడ్ల‌పై ఎక్క‌డంటే అక్క‌డ వాహ‌నాల‌ను చ‌లాన్లు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ.. బైక్ కీస్ లాక్కోవ‌డం స‌మంజ‌సం కాద‌ని కోర్టు హెచ్చ‌రించింది. వాహ‌నాల‌ను ఆప‌డం కూడా స‌రికాద‌ని కోర్టు పేర్కొంది. వాహ‌నం ఆపిన‌ప్పుడు వాహ‌న‌దారులు స్వ‌చ్ఛందంగా చ‌లాన్లు చెల్లిస్తే.. పోలీసులు వ‌సూలు చేసుకోవ‌చ్చ‌ని కోర్టు సూచించింది. ఒక వాహ‌న‌దారులు చ‌లాన్లు చెల్లించేందుకు నిరాక‌రిస్తే.. చ‌ట్ట ప్ర‌కారం నోటీసులు జారీ చేయాల‌ని కోర్టు ఆదేశించింది.

ట్రాఫిక్ పోలీసులు బ‌ల‌వంతంగా చ‌లాన్లు వ‌సూలు చేస్తున్నార‌ని ఇటీవ‌ల హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ పిటిష‌న్‌పై న్యాయ‌వాది విజ‌య్ గోపాల్ వాద‌న‌లు వినిపించారు. రోడ్ల‌పై వాహ‌నాల‌ను ఆపి పెండింగ్ చ‌లాన్ల వ‌సూలు కోసం ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని కోర్టుకు తెలిపారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల‌కు కోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement