త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | ఉగాది, రంజాన్ పండుగలు.. టీజీఎస్ ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు

TGSRTC | ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికుల ర‌ద్దీ దృష్ట్యా ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది.

S

Telangana | Published On Mar 16, 2026, 2.50 pm IST

TGSRTC | ఉగాది, రంజాన్ పండుగలు.. టీజీఎస్ ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు
Advertisement
TGSRTC | త్రినేత్ర‌.న్యూస్ : ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికుల ర‌ద్దీ దృష్ట్యా ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. ఈ నెల 17, 18 తేదీల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉన్నందున‌.. ఆ రెండు రోజుల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్నారు. అలాగే, ఈ నెల 23వ తేదీ తిరుగు ప్రయాణ రద్దీకి  సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది.
ప్రధాన పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతున్న సంగ‌తి తెలిసిందే. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ  బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడిపిస్తుంది.

ప్ర‌త్యేక బ‌స్సుల్లో టికెట్ల ధ‌ర‌లు పెంపు

ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.5 వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. ఈ ఉగాది, రంజాన్ పండుగ సెలవులకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5 వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి.

ఈ మూడు రోజుల్లోనే స‌వ‌రించిన ఛార్జీలు..             

ఈ నెల 17, 18 తేదీలతో పాటు  తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 23 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే  అమల్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లో  నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం రాష్ట్రంలో యథావిధిగా అమల్లో ఉంటుంది.
టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్  చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. ఉగాది, రంజాన్ పండుగల ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని సూచించింది.
Advertisement
Advertisement