త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | తెలంగాణ కామ‌న్ మ్యాన్స్ లైఫ్ లైన్‌.. టీజీఎస్ ఆర్టీసీ: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) తెలంగాణ కామ‌న్ మ్యాన్ లైఫ్ లైన్ అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. సంస్థ బ‌రువును మోయ‌లేం అనే స్థితి నుంచి ఆప‌రేష‌న‌ల్ ప్రాఫిట్స్‌కు వ‌చ్చే విధంగా ఆర్టీసీకి ప్ర‌భుత్వం స‌హాయం చేస్తుంద‌ని చెప్పారు.

G

Telangana | Published On Mar 18, 2026, 10.53 am IST

Ponnam Prabhakar | తెలంగాణ కామ‌న్ మ్యాన్స్ లైఫ్ లైన్‌.. టీజీఎస్ ఆర్టీసీ: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) తెలంగాణ కామ‌న్ మ్యాన్ లైఫ్ లైన్ అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. సంస్థ బ‌రువును మోయ‌లేం అనే స్థితి నుంచి ఆప‌రేష‌న‌ల్ ప్రాఫిట్స్‌కు వ‌చ్చే విధంగా ఆర్టీసీకి ప్ర‌భుత్వం స‌హాయం చేస్తుంద‌ని చెప్పారు. శాస‌న మండ‌లిలో ఆర్టీసీపై ప‌లువురు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణంతో రీయింబ‌ర్స్‌మెంట్ నెల‌నెలా సంస్థ‌కు చెల్లిస్తున్నామ‌న్నారు. రూ.600 కోట్లుగా ఉన్న సీసీఎస్ బ‌కాయిల‌ను రూ.360 కోట్లకు తీసుకొచ్చామ‌ని చెప్పారు. సంస్థ‌లో 3038 పోస్టుల‌ను కొత్త‌గా సృష్టించామ‌ని, గ‌త పాల‌కులు ప‌దేండ్ల‌లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వ‌లేద‌ని, ఒక్క కొత్త బ‌స్సు కొన‌లేద‌ని విమ‌ర్శించారు. తాము రెండేండ్ల‌లోనే 2708 బ‌స్సులు కొన్నామ‌న్నారు.

గ్రామీణ ప్రాంతాల‌కు కొత్త‌ రూట్ల‌లో క‌నెక్టివిటీ క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. 600 బ‌స్సుల‌కు మ‌హిళ‌ల‌ను య‌జ‌మానుల‌ను చేసి, ఈఎంఐ పోగా మ‌హిళా సంఘాల‌కు ప్ర‌తి నెల రూ.70 వేలు చెల్లుస్తున్నామ‌ని చెప్పారు. 1132 కారుణ్య నియామ‌కాలు చేప‌ట్టామ‌ని, రూ.17 కోట్లతో ఆర్టీసీ తార్నాక హాస్పిట‌ల్‌ను ఆధునీక‌రించామ‌ని, ఆర్టీసీ కార్మికులు చ‌నిపోతే వారికి రూ.కోటి ప‌రిహారం చెల్లించేలా ఏర్పాటు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

వివిధ కార‌ణాల వ‌ల్ల గ‌త ప‌దేండ్ల‌లో ఉద్యోగాల నుంచి తొల‌గించిన 250 మంది సిబ్బందిని తిరిగి తీసుకున్నామ‌ని తెలిపారు. రూ.1355 కోట్ల పీఎఫ్ బ‌కాయిలు ఉంటే వాటిని రూ.650 కోట్ల‌కు త‌గ్గించామ‌ని తెలిపారు. ఉచిత బ‌స్సు ప్ర‌యాణంతో మ‌హిళ‌లకు సాధికార‌త వ‌చ్చింద‌న్నారు. వారికి అద‌నంగా సంపాదించుకునే అవ‌కాశం క‌లింగ‌ద‌ని చెప్పారు. ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై అక్క‌సుతో విప‌క్షాలు ఆటో నినాదం ఎత్తుకున్నార‌ని విమ‌ర్శించారు. సిబ్బందికి ప‌నిభారం ఎక్కువైన‌ప్ప‌టికీ ప్ర‌తిరోజూ 60 ల‌క్ష‌ల మందిని గ‌మ్య‌స్థానాల‌కు చేస్తున్నార‌ని, ఇందుకుగాను ఆర్టీసీ సిబ్బందిని ప్ర‌తిఒక్క‌రూ అభినందించాల‌ని కోరారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement