త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Govt | తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం క‌మిటీ.. చైర్మ‌న్‌గా కే కేశ‌వ‌రావు

TG Govt | తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి, వారి త్యాగాలు, సేవలకు తగిన గౌరవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవోను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దీర్ఘకాల ఉద్యమ ఫలితంగా సాధ్యమైందని ప్రభుత్వం పేర్కొంది.

P

Telangana | Published On May 15, 2026, 8.35 pm IST

TG Govt | తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం క‌మిటీ.. చైర్మ‌న్‌గా కే కేశ‌వ‌రావు
Advertisement

TG Govt | తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి, వారి త్యాగాలు, సేవలకు తగిన గౌరవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవోను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దీర్ఘకాల ఉద్యమ ఫలితంగా సాధ్యమైందని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యమ సమయంలో పలువురు అమరులయ్యారని, మరికొందరు శారీరక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడించింది. ఉద్యమంలో వివిధ దశల్లో పాల్గొన్న “తెలంగాణ ఉద్యమకారులను” గుర్తించి గౌరవించాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్నట్లు జీవోలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉద్యమకారులను గుర్తించేందుకు, వారికి ఇవ్వాల్సిన గౌరవం, సౌకర్యాలపై సిఫార్సులు చేయేందుకు కమిటీని నియమించింది.

క‌మిటీ చైర్మ‌న్‌గా సీనియ‌ర్ నేత కే కేశ‌వ‌రావు.. స‌భ్యులుగా పొన్నం ప్ర‌భాక‌ర్‌, ప్రొఫెస‌ర్ ఎం కోదండ‌రాం, ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్‌, మాజీ ఎమ్మెల్సీ ఎం రాములు నాయ‌క్‌, మోతె శోభ‌న్‌రెడ్డిని నియ‌మించింది. ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి క‌మిటీ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రమాణాలు రూపొందించ‌డం, ఆ ప్రమాణాల ప్రకారం ఉద్యమకారుల జాబితా సిద్ధం చేయ‌డం, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన గౌర‌వం, సదుపాయాలల‌ను సిఫారు చేసే బాధ్య‌త‌ల‌ను క‌మిటీకి అప్ప‌గించింది. కమిటీ అవసరమైతే అధికారులను పిలిపించి సమాచారం సేకరించవచ్చని, సమావేశాలు నిర్వహించవచ్చని ప్రభుత్వం తెలిపింది. కమిటీ నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది.

Advertisement
Advertisement