త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Paddy Procurement | లారీలు, ట్రాక్ట‌ర్లు అందుబాటులో ఉంచండి.. అధికారుల‌కు ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ ఆదేశం

Paddy Procurement | రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు (Paddy Procurement) చురుకుగా సాగుతున్న నేపథ్యంలో అవసరమైన లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంచాలని రవాణా శాఖ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

G

Telangana | Published On May 7, 2026, 6.23 pm IST

Paddy Procurement | లారీలు, ట్రాక్ట‌ర్లు అందుబాటులో ఉంచండి.. అధికారుల‌కు ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ ఆదేశం
Advertisement

Paddy Procurement | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు (Paddy Procurement) చురుకుగా సాగుతున్న నేపథ్యంలో అవసరమైన లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంచాలని రవాణా శాఖ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములు, రైస్ మిల్లులకు ధాన్యం తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ధాన్యం తరలింపు విషయంలో జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరాలకు అనుగుణంగా వెంటనే వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం తరలించే రవాణా వాహనాలన్నింటికీ చెల్లుబాట‌య్యే పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఆర్‌సీ, ఫిట్‌నెస్‌, పర్మిట్‌, ఇన్సూరెన్స్‌, పీయూసీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పెద్దఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నందున, రవాణా వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలతో సమన్వయంతో వ్యవహరించాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. రవాణా సమయంలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. రవాణా ఏర్పాట్లపై అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.

Advertisement
Advertisement