త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Jana Samithi | మే మెదటి వారంలో తెలంగాణ జన సమితి ప్లీనరీ

Telangana Jana Samithi | తెలంగాణ జన సమితి నాలుగవ రాష్ట్ర ప్లీనరీ హైదరాబాద్ నగరంలో నిర్వహించాలని రాష్ట్ర విస్తృత స్థాయి కమిటీ నిర్ణయించింది. బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో టీజేఏస్ రాష్ట్ర విస్తృత స్థాయి కమిటీ సమావేశం అధ్యక్షులు ప్రొ. కోదండరాం అధ్యక్షతన జరిగింది.

S

Telangana | Published On Apr 8, 2026, 7.56 pm IST

Telangana Jana Samithi | మే మెదటి వారంలో తెలంగాణ జన సమితి ప్లీనరీ
Advertisement

Telangana Jana Samithi | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ జన సమితి నాలుగవ రాష్ట్ర ప్లీనరీ హైదరాబాద్ నగరంలో నిర్వహించాలని రాష్ట్ర విస్తృత స్థాయి కమిటీ నిర్ణయించింది. బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో టీజేఏస్ రాష్ట్ర విస్తృత స్థాయి కమిటీ సమావేశం అధ్యక్షులు ప్రొ. కోదండరాం అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు, రాజకీయ ప్రక్షాళన కొరకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుండి పార్టీని పటిష్టంగా నిర్మాణం చేయాలని, స్థానికంగా ప్రజా సమస్యలపై గళమెత్తాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రధాన సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రజా ఆందోళనలను నిర్మించాలని అన్నారు. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఎత్తివేసే సుప్రీంకోర్టు తీర్పును ప్రజల్లో ఎండగట్టాలని, దీని కోసం కలిసి వచ్చే శక్తులతో కలిసి దళితులైన వారి జన్మ హక్కును కాపాడడం కోసం ఉద్యమించాలని ఆయన అన్నారు. రోజురోజుకు తీవ్రమవుతున్న కార్మికుల సమస్యలపై ప్రధానంగా ఆర్టీసీ పరిరక్షణ, సింగరేణి పరిరక్షణకై ప్రత్యేక కార్యచరణకు పూనుకుందామని అన్నారు.

రాజకీయాలు అంటేనే డబ్బుల ప్రవాహంగా మార్చిన సమకాలీన జూదపు రాజకీయాలను ఎండగడుతూ ప్రజాస్వామిక రాజకీయాల నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ జన సమితి పనిచేస్తుందని అన్నారు. మే మొదటి వారంలో నిర్వహించే రాష్ట్ర ప్లీనరీలో నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సిద్ధం కావాలని ఆయన పార్టీ రాష్ట్ర నాయకులకు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్లీనరీ విజయవంతం కొరకు పలు కమిటీలను ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో టీజేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కుంట్ల ధర్మార్జున్, అంబటి శ్రీనివాస్, బైరి రమేష్, పల్లె వినయ్ కుమార్, గోపగాని శంకర్ రావు, నిజ్జన రమేష్ ముదిరాజ్, ఆశప్ప, టీజేఏస్ యూత్ రాష్ట్ర అధ్యక్షులు సలీమ్ పాషా, టీజేఏస్ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ ప్రసాద్, టీజేఏస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఏమ్. నర్సయ్య తదితరులు హాజరయ్యారు.

Advertisement
Advertisement